News

అర్జున్ కూతురికి ఎన్ని కోట్లు కట్నంగా ఇచ్చాడో తెలుసా..?

లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతితో ఈనెల ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. ఇరుకుటుంబాల సహా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా.. శుక్రవారం చెన్నై లీలా ప్యాలెస్‏లో వీరి రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే ఈ పెళ్లి తర్వాత.. కట్నం కి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం.. అర్జున్.. తన కుమార్తెకు దాదాపు రూ.500కోట్ల కట్నం ఇచ్చారంటూ నెట్టింట న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఓ జర్నలిస్ట్ కూడా ఇదే విషయాన్ని యూట్యూబ్ ఛానెల్ లో పేర్కొనడం గమనార్హం. అర్జున్ కి చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయట. అర్జున్‌కు చెన్నైలోని పోరూర్‌లో చాలా స్థలాలు ఉన్నాయి.

ఆయనకు దాదాపు రూ. వెయ్యి కోట్ల ఆస్తులు ఉండగా.. అందులో రూ.500కోట్లు కూతురు ఐశ్వర్యకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను కూడా బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మాత్రం తెలీదు. కానీ.. అర్జున్ కి మగ పిల్లలు లేరు. ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే. ఇక ఆయన సంపాదనంతా..ఆ ఇద్దరు కూతుళ్లకే చెందుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రూ.500కోట్ల కట్నం ఇచ్చిన విషయంలో నిజానిజాలు ఎవరికీ తెలియకపోయినా… నెటిజన్లు మాత్రం అదే నిజం అని ఫిక్స్ అవుతుండటం విశేషం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker