News

సూపర్ స్టార్ కృష్ణ మరియు బాల సుబ్రహ్మణ్యం మధ్య గొడవ జరగడానికి గల కారణం ఎవరో మీకు తెలుసా..?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవ గురించి స్పందించారు. “మేమిద్దరం ఒకసారి ఫోన్ లో సంభాషించుకుంటుంటే మరో వ్యక్తి వల్ల వివాదమొచ్చింది. ఇద్దరం కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుకున్నాం. అప్పుడే డిసైడ్ చేసుకున్నా మళ్ళీ కృష్ణ సినిమాలకు పాడకూడదని. మా ఇద్దరినీ కలపడానికి చాలా మంది ప్రయత్నించారు. అయితే దివంగత సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. టార్చ్ బేరర్. తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ. .

ఈయనకు తెలుగు ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు గాంచిన ఎస్పీబాల సుబ్రహ్మణ్యంకు ఓ విషయంలో మనస్పర్థలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో గాయకుడిగా ఘంటసాలనే పెద్ద హీరోలకు పాటలు పాడేవారు. బాలు అపుడే గాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలు అప్పటి అప్‌కమింగ్ హీరోలుగా ఉన్న కృష్ణ, శోభన్ బాబులతోపాటు కమెడియన్లకు పాటలు పాడేవారు. ఇలాంటి సమయంలో కృష్ణ.. తాను యాక్ట్ చేసే సినిమాలకు ఎస్పీ బాలు గారినే గాయకుడిగా ప్రోత్సహించారు. ముందుగా కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో తొలిసారి అన్ని పాటలు బాలుగారితో పాడించారు కృష్ణ. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉండేది.

ఆ తర్వాత అదే చనువుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కృష్ణ హీరోగా కొంత మంది వేరే నిర్మాతలతో కలిసి కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ‘కెప్టెన్ కృష్ణ’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కాకపోయినా.. ఓ మోస్తరుగా నడిచింది. ఆ సినిమా సమయంలో బాలుగారు, కృష్ణగారికి ఇవ్వాల్సిన పూర్తి పారితోషం ఇవ్వలేకపోయారు. కృష్ణ కూడా బాలు ఇబ్బందులను గమనించి ఆ రెమ్యునరేషన్ విషయాన్ని మరిచిపోయారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత విజయ నిర్మల తన ఓన్ ప్రొడక్షన్స్ విజయ కృష్ణ బ్యానర్‌లో పాటలు పాడాలని బాలును కోరారు.ఈ సందర్భంగా బాలు… ఈ బ్యానర్‌లో అంతకు క్రితం తనకు రావ్వాల్సిన పారితోషకం ఇస్తే పాడుతా అని కబురుచేసారట.

దీంతో కృష్ణ.. అప్పట్లో కెప్టెన్ కృష్ణ సమయంలో తనకు రావాల్సిన పారితోషకం ఇవ్వాలంటూ చెబుతూ.. ఎస్పీ బాలుకు కబురు చేస్తూనే.. బాలుకు విజయ నిర్మల బాకీ ఉన్న పారితోషకాన్ని పంపించారు. అదే సమయంలో కృష్ణ. బాలుతో నువ్వు లేకుంటే నా సినిమాలు రిలీజ్ కావని చెప్పావట అని నిలదీసారట. కానీ బాలు మాత్రం ఎవరో గిట్టని వాళ్లు చెప్పిన దాన్ని కృష్ణ అపార్ధం చేసుకున్నారని మిన్నకుండిపోయారట బాలు. అదే సమయంలో తమకు రావాల్సిన రెమ్యునరేషన్ పంపించమని కృష్ణ కోరారు. ఆ సమయంలో బాలు గారు కృష్ణ గారికి ఇవ్వాల్సిన బాకీ తీర్చేసారు. ఆ తర్వాత కృష్ణ, విజయనిర్మల దర్శకత్వంలో ‘సూర్య చంద్ర’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతం అందించారు.

ఈ సినిమాలో పాటలను బాలుతో కాకుండా రాజ్ సీతారామ్‌తో పాడించాలని కోరారు కృష్ణ. అప్పటి నుంచి కొన్నేళ్ల వరకు కృష్ణ నటించిన పలు చిత్రాలకు రాజ్ సీతారామే పాటలు పాడారు. వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినా.. కృష్ణగారు తన సినిమాల్లో బాలు చెల్లెలు ఎస్పీ శైలజతో పాటలు పాడించారు. ఆ తర్వాత కొన్నేళ్లుకు కృష్ణ .. ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో ‘రౌడీ నెంబర్ 1’ సినిమా చేసే సమయంలో సంగీత దర్శకుడు రాజ్‌ కోటి కృష్ణగారి దగ్గరికి వెళ్లి ఈసినిమాలో పాటలు బాలు గారితో పాడిస్తే బాగుంటుందని కోరారు.

అలా వేటూరి మధ్యవర్తిత్వంతో బాలుగారిని ఒప్పించారు. బాలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పద్మాలయా స్టూడియోలో కృష్ణగారిని కలవడానికి వెళ్లారు.ఆ వెంటనే ఇంతకు ముందు జరిగిన విషయాలను ఇద్దరం మరిచిపోదాం అంటూ మనద్దరం కలిసి పనిచేస్తున్నాం అంటూ కృష్ణగారు బాలుగారితో అనడం.. అప్పటి నుంచి మరల కృష్ణగారికి బాలు గారు పాడటం తిరిగి మొదలైంది. అలా టీ కప్పులో తుఫానులా బాలు, కృష్ణ మధ్య ఉన్న వివాదం సద్దు మణిగింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker