News

హోమ్‌లో అమానుషం. పిల్లలను మంచానికి కట్టేసి చెప్పుతో కొట్టిన అధికారి.

బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది. ఆగ్రాలోని జువైనల్ హోంలో సీసీ టీవీలో కొన్ని దృశ్యాలు రికార్డయ్యారు.

ఇవి సోమవారం నుంచి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అక్కడి చిన్నారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఈ వీడియోలుఅందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి. సోమవారం, మంగళవారం రెండు వీడియోలు విడుదల కాగా అవి విస్మయానికి గురిచేస్తున్నాయి.

సోమవారం విడుదల చేసిన వీడియోలో ఒక గదిలో మంచంపై పడుకొని ఆరుగురు బాలికలు ఉన్నారు. ఇంతలో సడెన్ గా అక్కడికి వచ్చిన జువైనల్ హోం సూపరింటెండెంట్ పూనమ్ పాల్ కనికరం లేకుండా ఓ బాలికను చెప్పుతో ఎలా పడితే అలా కొట్టింది. అంతేకాకుండా ఇతర బాలికలను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టడం వీడియోలో కనిపిస్తుంది.

ఇదంతా చూస్తున్న తోటి ఉద్యోగులు కూడా ఆమెను ఆపలేదు. ఇంకా మంగళవారం విడుదలైన వీడియోలో ఏడేళ్లు వయసు ఉన్న బాలికను మంచానికి కట్టేశారు. ఆమె విడుపించుకోవడానికి ప్రయత్నించిన వీలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశాడు.

దీంతో ఈ విషయంపై విచారణ జరిపిన అధికారులు పాల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker