News

కుర్చీతాతకు క్యాన్సర్, అసలు విషయం చెప్పేసిన వైద్యులు.

కుర్చీ తాత యాటిట్యూడ్ కా బాప్. ఆయన మాటలు కరుకుగా కుంబద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఈ లక్షణం యూట్యూబర్స్ ని ఆకర్షించింది. కుర్చీ తాతను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టాయి. కుర్చీ తాతకు మంచి బట్టలు కొనిచ్చి, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకునేవారు. కుర్చీ తాత పవన్ కళ్యాణ్ ని తిట్టాడు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు.

అలాగే మరికొందరు పొలిటీషియన్స్ కుర్చీ తాత తిట్టాడు. ఈ క్రమంలో కుర్చీ తాతకు శత్రువులు కూడా ఏర్పడ్డారు. కుర్చీ తాత డైలాగ్ వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డబ్బులు కూడా ఇచ్చాడని ప్రచారం జరిగింది. కుర్చీ తాతకు థమన్ రూ. 1 లక్ష ఇచ్చారట. కుర్చీ తాతకు గుంటూరు కారం యూనిట్ డబ్బులు ఇచ్చారన్నది ఎంత వరకు నిజమో తెలియదు కానీ… అనూహ్యంగా బిచ్చం ఎత్తుకుంటూ కనిపించాడు.

అయితే తోటి యూట్యూబర్లను తిట్టిన కేసులో జైలు పాలైన కుర్చీతాత.. కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆ తర్వాత ఏం అయ్యారో కూడా తెలియదు. అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుర్చీతాతను ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.

గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు పరీక్షించగా.. క్యాన్సర్ అని నిర్థారణ అయ్యింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. కాగా, ఆయన ఆల్కహాలిక్ కూడా కావడంతో ఈ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker