News

పెళ్లైన రెండేళ్లకే దర్శకుడు క్రిష్ కు విడాకులిచ్చిన భార్య, కారణం అదే అంటూ..?

‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా క్రిష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా నిలిచారు.

మొత్తం తొమ్మిది మంది ఉండగా అందులో క్రిష్ ఒకరు.. క్రిష్ ను విచారణకు కావాలని కూడా పోలీసులు సూచించారు. ఇదిలా ఉంటే.. క్రిష్ గురించిన కొన్ని విషయాలు ప్రస్తుతం మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన డివోర్స్ మేటర్ తెరపైకి వచ్చింది. అయితే ఫిలింనగర్ లో పలు కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో డాక్టర్ అయిన రమ్య వెలగ ను వివాహం చేసుకున్నాడు క్రిష్. కానీ కొద్దిరోజులలోనే విడాకులు తీసుకున్నారు.

అప్పట్లో ఇద్దరు ఫీల్డులు వేరు కాబట్టి సర్దుకోలేకపోయారని వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు డ్రెగ్ వ్యవహారం బయటకు వచ్చాక డాక్టర్ రమ్యకు క్రిష్ గురించి తెలుసుకున్నాక విడాకులు తీసుకుందని కొందరు భావిస్తున్నారు. అయితే క్రిష్ పై వచ్చిన ఈ ఆరోపణలో నిజానిజాలు ఎలా వున్నా, ఆయన దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ తాజా సినిమా హరిహర వీరమల్లు పై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

రాజకీయ నాయకుడిగా పవన్ పై కూడా ఒత్తిడి వుంటుందనీ, కనుక ఈ సినిమాకు మొదటినుంచి వున్న అడ్డంకులకు తోడు డ్రెగ్ వివాదం మరో అడ్డంకి కానున్నందని భావిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker