Health

మీకు ఉదయాన్నే 5 గంటల లోపు మెలకువ వస్తుందా..? మీ కోసమే ఈ విషయాలు.

చాలా మంది ప్రజలు ఉదయం పూట విడతలవారీగా లేదా అప్పుడప్పు లేదా కొద్ది కొద్దిగా నిద్రపోతుంటారు. మీకు గనుక మద్యరాత్రుల్లో మెలుకువ వచ్చి అర్ధగంట కంటే ఎక్కువ సేపు అలానే గనుక మెలుకువగా ఉంటే, ఈ పరిస్థితి కనుక వారంలో మూడు రోజులు కొనసాగితే అది అనేక రకాల సమస్యలను సూచిస్తుంది. ఇవి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అయితే రాత్రిళ్లు ఎక్కువ సేపు మెలకువ ఉన్నవారు మధ్యాహ్నం వరకు మంచం వీడరు.

సమయ పాలన లేకుండా నిద్ర లేవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు ఉదయం 6 గంటల లోపు లేవకుండా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. స్కూలుకెళ్లే వారు కనీసం 6 గంటల వరకు నిద్రలేవాలి. అయితే పూర్వీకులు చీకటి తొలగకముందే నిద్రలేచేవారు. ఉదయం పనులన్నీ సూర్యోదయానికి ముందే చేసేవారు. ఆ తరువాత ఎవరి పనులకు వారు వెళ్లేవారు. సాయంత్రం 7 గంటల తరువాత ఎవరూ మెళకువ ఉండేవారు కాదు.

దీంతో అప్పటి వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్ల వరకు జీవించగలిగారు. కానీ నేటి కాలంలో చాలా మంది ఉదయం 7 తరువాత కానీ లేవడం లేదు. సూర్యుడు వచ్చిన తరువాతే నిద్ర నుంచి తేరుకుంటున్నారు. కొందరికి కొన్ని కారణాల వల్ల రాత్రిళ్లు నిద్ర పట్టదు. మరికొందరు చాలా లేటుగా పడుకోవడం వల్ల మధ్యలోనే మెళకువ అవుతుంది. అయితే ఉదయం 3 నుంచి 5 గంటల లోపు మెళకువ వచ్చే వారి జీవితంలో విశేషాలు జరుగుతాయని కొందరు ఆధ్యాత్మిక వాదులు పేర్కొంటున్నారు.

ఉదయం 3 నుంచి 5 గంటల కాలాన్ని బ్రహ్మమహూర్తం అంటారు. ఈ సమయంలో దేవాలయాలు తెరిచి దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మనుషులు కూడా ఈ సమయంలో నిద్ర లేచి తమ పనులు చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే అనుకోకుండా ఉదయం 3 నుంచి 5 గంటల లోపు మెళకువ వచ్చేవారికి త్వరలో వారి సంపద వృద్ధి చెందుతుందని అర్థం.

అప్పటి నుంచి వారి జీవితం మారిపోతుంది. ఈ సమయంలో వారికి అప్రమత్తం చేయడానికే మెళకువ చేస్తారని కొందరు చెబుతున్నారు. ఈ సమయంలో అనుకోకుండా మెళకువ రాకున్నా నిద్ర లేని పూజలుచేయడం వల్ల అనుకున్నవన్నీ నెరవేరుతాయని కొందరు అంటున్నారు. అందువల్ల సూర్యోదయానికి ముందే లేచే అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker