Health

ఈ గింజలు తరచూ తింటుంటే చాలు, జీవితంలో రొమ్ము క్యాన్సర్ రాదు.

బాధితుల రొమ్ము లేదా చంకలో ఏర్పడే గడ్డ పూర్తిగా నయం కాదు. ఇది రొమ్ము క్యాన్సర్ మొదటి లక్షణం. ఈ గడ్డను బాధితులు గుర్తించడానికి ముందే వైద్యులు మామోగ్రామ్‌లో వీటిని గుర్తించవచ్చు. బాధితుల చంకలో లేదా కాలర్‌బోన్ దగ్గర వాపు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఆ ప్రాంతంలోని శోషరస గ్రంథులకు వ్యాపించిందని దీని అర్థం. గడ్డ ఏర్పడటానికి ముందే ఈ వాపు ప్రారంభం కావచ్చు. కాబట్టి రొమ్ము, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాపు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

అయితే ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల అరోగ్యంగా ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు. నిత్య జీవితంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ రోజుల్లో మహిళల్లో రొమ్ము క్యాన్సన్‌ వెంటాడుతుంటుంది. ఈ రొమ్ము క్యాన్సర్‌లో రకరకాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే అవిసె గింజలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. బరువు తగ్గడమే కాకుండా, ఇది మన చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అయితే దాని ప్రయోజనాల జాబితాలో కొత్త విషయం జోడించబడింది. దీని రోజువారీ ఉపయోగం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవలి పరిశోధనలో కనుగొన్నారు.

అవిసె గింజలు పేగు సూక్ష్మజీవులు, క్షీర గ్రంధుల మైక్రోఆర్ఎన్ఏలను ప్రభావితం చేస్తాయని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్ మైక్రోబయాలజీ స్పెక్ట్రమ్‌లో ఇటీవల ప్రచురించిన నివేదిక వెల్లడించింది. వాటి ఉపయోగం రొమ్ము క్యాన్సర్‌లో పాల్గొన్న జన్యువులను నియంత్రించడంలో సహాయపడింది. తద్వారా కణాల అనియంత్రిత విస్తరణను తగ్గిస్తుంది, ఇది రొమ్ము క్యాన్సర్ ఏర్పడటానికి దారితీస్తుంది.

మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చాలా కాలంగా తెలిసిన విషయమే అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనలో అనేక రకాల ఆహారాలు చేర్చబడ్డాయి, అయితే అవిసె గింజలు రొమ్ము క్యాన్సర్‌పై అత్యంత ప్రభావవంతమైనవిగా గుర్తించారు పరిశోధకులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker