News

ఫస్ట్‌నైట్ రోజున వధువుకు విపరీతమైన కడుపునొప్పి, ఆస్పత్రికి తీసుకెళ్లగా బయటపడ్డ అసలు నిజం.

శోభన రాత్రి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన కర్మ. భారతీయ ఉపఖండంలో కొత్తగా వివాహం చేసుకున్న జంట, వివాహం పూర్తయిన మొదటి రాత్రిని సూచిస్తుంది. కొత్త జంట యొక్క మంచం పువ్వులతో అలంకరించబడి ఉంటుంది, ఇవి వారి సంబంధానికి మధురమైన క్షణాలను ఇస్తాయని నమ్ముతారు. హిందూ వివాహాల్లో అనుసరించే ముఖ్యమైన ఆచారం ఇది. అయితే పెళ్లయిన రెండు రోజులకే ఓ యువతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని వరుడి కుటుంబం దెబ్బకు షాక్ అయింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధామ్‌నోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గ్రామంలో చోటు చేసుకుంది. సదరు యువతిని ప్రసవం గురించి అత్తమామలు ప్రశ్నించగా, తనకు పరిచయస్తుడైన ఒకడు పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేసి మోసం చేశాడని చెప్పుకొచ్చింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిందితుడు సరాయ్ గ్రామానికి చెందిన సునీల్ బాఘెల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. ధామనోడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సదరు యువతికి మే 20న వివాహం అయితే.. రెండు రోజుల తర్వాత మే 22 తెల్లవారుజామున ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఆమె భర్త వెంటనే ఆమెను ధామ్‌నోడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా, ఆమె నిండు గర్భిణి అని వైద్యులు వెల్లడించారు. షాక్ తిన్న వరుడి కుటుంబీకులు యువతిని ప్రశ్నించారు. నెలల తరబడి దాచిపెట్టిన అత్యాచారం, మోసం అనే భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. రెండేళ్ల క్రితం సిమ్రాలి గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో సునీల్‌ అనే వ్యక్తిని కలిశానని వివరించింది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకోవడం.. క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేసుకోవడం జరిగింది.

సునీల్ చాలాసార్లు ఆమెను కలిసేవాడట. సుమారు తొమ్మిది నెలల క్రితం, పెళ్లి పేరుతో సదరు యువతిని పొలంలోకి తీసుకెళ్ళి.. ఆమెపై అత్యాచారం చేశాడు. అతడి బెదిరింపులకు భయపడిన యువతి ఈ నిజాన్ని కుటుంబం నుంచి దాచిపెట్టింది. తాను గర్భవతినని సునీల్‌కు పలుమార్లు చెప్పినా.. అతడు పట్టించుకోకుండా.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కాగా, ఈ విషయం బయటికి రావడంతో యువతి కుటుంబసభ్యులు సునీల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సునీల్‌పై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker