News

రెండవ సారి తల్లి అయిన ఫేమస్ సింగర్, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటుడి భార్య.

ఫిబ్రవరి 10నే గీతా మాధురి డెలివరీ అయింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పంచుకున్నారు. అభిమానుల ఆశీస్సులకు ధన్యావాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఫేమస్ సింగర్ గీతామాధురి మరోసారి తల్లైంది. ఇప్పటికే ఓ పాపకు జన్మనిచ్చిన సింగర్ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నటుడు నందును వివాహం చేసుకున్న గీతా మాధురి ఇప్పుడు తన ఫ్యామిలీలో మరొకరు చేరిపోయారనే శుభవార్తను ఆమె భర్త నందు అందరితో షేర్ చేసుకున్నాడు.

ఫిబ్రవరి 10వ తేదిన తమకు పండంటి మగబిడ్డ జన్మించాడని సోషల్ మీడియాలో ప్రముఖ సింగర్ గీతామాధురి భర్త, నటుడు నందు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నాడు. రెండో బిడ్డ పుట్టడంతో గీతామాధురి ఇంట్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈ స్టార్ జోడి మరోసారి పేరెంట్స్ గా మారిన గుడ్ న్యూస్ విని నెటిజన్లు సింగర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. గీతామాధురి సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ వేడుకలో సుమారు 800 మందికి గీతామాధురి, నందు అన్నదానం చేశారు. నందు స్వయంగా వంటకాలను తయారుచేయించి వడ్డించారు. అయితే నందు, గీతామాధురి కొద్దిరోజులుగా పాటలు పాడకపోవడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో పుకార్లు షికార్లు చేశాయి.అంతే కాదు నందు, గీతామాధురి విడిపోతున్నారనే పుకార్లు కూడా కొన్ని వెబ్ సైట్లు ప్రచూరించాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ కి గీతామాధురి నెల రోజుల క్రితం వివరణ ఇచ్చింది.

దాక్షాయణి ప్రకృతి (తన కూతురు) అక్క కాబోతోందంటూ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ప్రెగ్నెన్సీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవల జరిగిన తన సీమంతం ఫొటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. తాజాగా తనకు కొడుకు పుట్టినట్లు పోస్ట్ చేసింది. నందు, గీతామాధురి ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker