News

పెళ్ళైన స్టార్ హీరోతో సంబంధం పెట్టుకొని కెరీర్ నాశనం చేసుకున్న తెలుగు హీరోయిన్.

2003లో రిలీజైన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. కాగా ఈ కుటుంబ కథాచిత్రంలో హీరోయిన్‌గా నటించింది నిఖిత తుక్రాల్‌. వేణును ఆటపట్టిస్తూనే అతని ప్రేమలో పడే కల్యాణి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన నిఖిత మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత ఆర్యన్‌ రాజేష్‌తో కలిసి టాలీవుడ్‌కు ‘హాయ్‌’ చెప్పింది. అయితే వ్యక్తిగత జీవితంలో చేసిన కొన్ని తప్పుల కారణంగా కెరీర్‌ను నాశనం చేసుకున్న హీరోయిన్లు కొందరు ఉన్నారు. వారిలో నిఖితా తుక్రాల్ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఆల్రెడీ పెళ్లయిన ఒక కో-యాక్టర్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్‌కు ఆమెపై గౌరవం పోయింది. తర్వాత నిఖిత ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.

ముంబై బ్యూటీ ముంబైలో పుట్టి పెరిగిన నిఖిత, ఎంఏ ఎకనామిక్స్ చదివింది. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ఆమె ప్రతిభను గుర్తించి, ‘హాయ్ (2002)’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దీనికంటే ముందు ఘటోత్కచుడు (1995)లో బేబీ నిఖితగా ఆమె ఆలరించింది. తర్వాత తెలుగులో కళ్యాణ రాముడు, సంబరం, ఖుషి ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, చింతకాయల రవి, అవును 2 వంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నిఖిత తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అనేక హిట్ సినిమాల్లో నటించింది.

అయితే ఒక మూవీ షూటింగ్ టైమ్‌లో కన్నడ నటుడు దర్శన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్‌కు పెళ్లయింది. తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. దర్శన్, నిఖిత ఇద్దరినీ ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా, ఈ విషయం సంచలనంగా మారింది. దర్శన్‌పై భార్య విజయలక్ష్మి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నిఖితపై కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మూడేళ్లు నిషేధం విధించింది. తర్వాత ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమాలకు దూరం కొంతకాలం తర్వాత ఆమెపై విధించిన బ్యాన్‌ను లిఫ్ట్ చేశారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నిఖితకు మంచి అవకాశాలు ఒక్కటి కూడా రాలేదు. దీంతో ఫేడ్ అవుట్ అయ్యి, సినిమాలకు దూరమైంది. మరో వ్యక్తితో పెళ్లి 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. తన ఫ్యామిలీ ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. నిఖిత రీఎంట్రీలో 2020లో ఈటీవీలో ప్రసారమైన “యమలీల ఆ తర్వాత” సీరియల్‌లో కమెడియన్ అలీ వైఫ్‌గా కనిపించింది. ఆమె నటించిన చివరి సినిమా రాజసింహా (కన్నడ) 2018లో రిలీజ్ అయింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker