Health

మధుమేహం వ్యాధి ఉన్నవారు తేనె తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో మధు మేహం వ్యాధి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ షుగర్ వచ్చేస్తుంది.

డయాబెటీస్ రావడానికి ప్రత్యేకంగా ఒక్క కారణం అంటూ ఉండదు. ముఖ్యంగా మారిన జీవన విధానం కారణంగా ఈ షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. అయితే లైఫ్ స్టైల్ కొన్ని మార్పులు చేర్పులతో మధు మేహాన్ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. షుగర్ ఉన్న వారు తీపిగా ఉన్న పదార్థాల జోలిక అస్సలు రావద్దని వైద్యులు చెబుతారు. అయితే కొందరు తేనె తీసుకోవచ్చని అంటున్నారు. మరి తేనె తీసుకోవడం వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె అనేది నేచురల్ స్వీట్నర్. తేనె.. పంచదార కంటే తియ్యగా ఉంటుంది. అలాగే ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యితో బెల్లం కలిపి తింటే జీవక్రియ మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

అయితే భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. కానీ తేనెలో మాత్రం కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తేనెను బరువు తగ్గించుకునే ప్రక్రియలో అంతగా ఉపయోగించకపోవడే మంచిది. బరువు తగ్గాలి అనుకునే వారు కార్బొహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కానీ ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం చక్కెర కంటే తేనె మంచిది.

పంచదారను ఎక్కువగా తీసుకోవడం వలన.. డయాబెటీస్ రావడంతో పాటు బరువు కూడా విపరీతంగా పెరిగి పోతారు. కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని బట్టి చూస్తే మధు మేహం ఉన్న వారికి పంచదారకు బదులు తేనె వాడటం బెటర్. అయితే మంచిదని మరీ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకూ మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker