News

కోడలిపై మనసు పడ్డ మామ.. కోడుకు లేని సమయంలో ఎంజాయ్. చివరికి కొడుకుకి తెలియడంతో..!

వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ.. అందుకు తగినట్టు తన భర్త గుణగణాలు లేకపోవడం తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని తమ కోర్కెలను తీర్చుకునేందుకు ఉబలాటపడటం. అయితే ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత కోడలిపైనే మనసు పడ్డ మామ.. కొడుకు చేతిలో అతి కిరాతంగా చంపబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే భూత్ బంధాని గ్రామానికి చెందిన దరోగ్ సింగ్ అనే వ్యక్తి కొడుకు సంజయ్ ధుర్వేలో కలిసి ఉంటున్నాడు. అయితే సంజయ్‌కు గతంలో ఓ యువతితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ముగ్గురు కలిసి ఉండేవారు. కొడుకు రోజూ ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అందంగా ఉండే కోడలిపై మామ కన్నుపడింది. ఆమెపై మనుసు పడ్డాడు. కొన్నాళ్లకు కోడలు సైతం మామపై ఇష్టం పెంచుకుంది.

ఇక కొడుకు లేని సమయంలో తండ్రి కోడలితో కలిసి ఆనందంగా గడిపేవాడు. అయితే కొన్నాళ్ల తర్వాత తండ్రి, భార్యపై సంజయ్‌కు అనుమానం వచ్చింది. చివరికి వారిపై నిఘా పెట్టాడు. తండ్రికి భార్యతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. ఇక తండ్రిని ఎలా అయినా చంపాలని ప్లాన్ చేసిన సంజయ్.. దరోగ్‌తో మాట్లాడాలని ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక అక్రమ సంబంధం విషయమై తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

దీంతో క్షణికావేశంలో ఉన్న కొడుకు తన తండ్రిని అతికిరాతంగా హత్య చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న భార్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడు సంజయ్‌ని అరెస్ట్ చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker