News

కుమారీ ఆంటీకి హీరో సందీప్ కిషన్ మద్దతు..! రాజకీయ కుట్రతోనే కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్.

మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వల్ల ట్రాఫిక్ ఏర్పడుతోంది. దానివల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగుతోంది. అందుకే ఆమె ఫుడ్ సెంటర్‌ను వేరేచోటుకు మార్చుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అయితే . ఇటీవల కుమారి ఆంటీని పలువురు యూట్యూబర్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రెటీలు సైతం కుమారి ఆంటి వద్దకు వెళ్లిఅక్కడి ఫుడ్ తిని మెచ్చుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు అదే ఆమె కొంప ముంచిందని అంటున్నారు. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు.. కేసు కూడా పెట్టే పరిస్థితికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు పలువురు మద్దతు ఇస్తున్నారు. కుమారి ఆంటీ గురించి తెలిసిన హీరో సందీప్ కిషన్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇటీవల ఊరిపేరు భైరవకోన సినిమా ప్రమోషన్ సందర్భంగా తన బృందంతో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కి వెళ్లాడు.

ఈ సందర్భంగా అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందని మెచ్చుకున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి కుమారి ఇంటీ మరింత పాపులర్ అయ్యింది. తాజాగా కుమారి ఆంటీ పరిస్తితి గురించి తెలుసుకున్న సందీప్ కిషర్ ట్విట్టర్ వేధికగా ఆమెకు మద్దతు తెలిపారు. ‘ ఆమె చాలా మంది మహిళలకు ప్రేరణ, సొంతంగా వ్యాపారం చేసుకుంటూ తన జీవితం పోషించుకుంటుంది.

ఈ మధ్య కాలంలో నేను చూసిన గొప్ప మహిళా సాధికారత ఉదాహరణలలో ఇది ఒకటి. ఆమెకు నేను, నా టీమ్ అండగా ఉంటాం’ అంటూ ట్వీట్ చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker