News

నయనతార విడాకులు తీసుకుంటోందా..? విఘ్నేష్ పోస్ట్ కి అర్ధం తెలిస్తే..?

నయనతార భర్త విఘ్నేష్ శివన్ ను అన్ ఫ్రెండ్ చేసిందని ..త్వరలోనే భర్తతో విడాకులు తీసుకుంటోందని వార్త గత కొంతకాలంగా వార్తల్లో నిలిచింది. దీనికి తోడు నయనతార విఘ్నేష్ ని సోషల్ మీడియాలో అన్ ఫ్రెండ్ చేయడంతో ఈ అనుమానం మరింత బలపడింది. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో వివాదం మొదలైంది.

దీనితో పాటు, నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కథ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ లో ఏమైనా సమస్యలు తలెత్తాయేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నయనతార నోట్‌లో ‘ఆమె ఎప్పుడూ తన కళ్లతో ఇది ఉందని చెబుతూ ఉంటుంది’ అని రాసి ఉంది. నయనతార ఇప్పుడు అలాంటి కథను ఎందుకు పంచుకుందని అభిమానులు అడుగుతున్నారు.

అయితే తాజాగా, తన భార్య నయనతారకు ఓ అవార్డు వచ్చిందంటూ విఘ్నేశ్ శివన్ ఎంతో మురిపెంతో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇటీవలే నయనతార ఓ చర్మసౌందర్య ఉపకరణాల బ్రాండ్ ను తీసుకువచ్చారు. ఆ బ్రాండ్ కు అవార్డు వచ్చిందని విఘ్నేశ్ ఎంతో సంతోషంగా వెల్లడించారు. ఈ పోస్టుతో నయనతార విడాకుల కథనాలకు అడ్డుకట్ట పడింది. దీనిపై అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

నయనతార, విఘ్నేశ్ కాపురం ఎంతో హాయిగా సాగుతోందనడానికి ఈ పోస్టే నిదర్శనమని అభిమానులు సంతోషం వెలిబుచ్చుతున్నారు. ఏదో సాంకేతిక లోపం వల్లే విఘ్నేశ్ శివన్ పేరు నయనతార ఇన్ స్టా ఫాలోవర్ల జాబితాలో కనిపించి ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు. నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker