News

Pooja Hegde: విలాసవంతమైన ఇల్లు కొన్న పూజా హెగ్డే. ధర ఎంతో తెలుసా..?

2022 నుండి అస్సలు కలిసిరాలేదు పూజా హెగ్డేకు. ఏ సినిమా చేసిన ప్లాప్ అవ్వడం.. తాను చేయబోయే సినిమాలు ఆగిపోవడం లాంటివి చాలా జరిగాయి. గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవల్సి వచ్చింది.. విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన సినిమా ఆగిపోయింది. పాన్ ఇండియా సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్లాయి. అయితే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ బ్యూటీకి తెలుగులో బొత్తిగా అవకాశాలు రాకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు ఈ బ్యూటీ.

అది అలా ఉంటే పూజా హెగ్డే.. ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లు కొన్నదని తెలుస్తోంది. బీచ్ వ్యూలో ఉంటే ఈ ఇల్లు 4000 చదరపు అడుగుల్లో విశాలంగా ఉంటుందట. అది కూడా ముంబైలో ఖరీదైన ఏరియా బాంద్రాలో ఈ ఇల్లును కొన్నదట. ఈ ఇంటి ఖరీదు అక్షరాల 45 కోట్లని తెలుస్తోంది. ఈ ఇంట్లో అత్యంత అధునాతన సౌకర్యాలుంటాయట. ఇక ఈ వార్త చూసిన నెటిజన్స్, ఇంత ఖర్చు పెట్టి అంత ఖరీదైన ఇల్లు ఎందుకు కొన్నట్లు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరికొందరు మాత్రం ఈ 45 కోట్లతో రాజమౌళితో ఈగ సినిమా తీయ్యోచ్చని అంటున్నారు. ఎందుకంటే ఈగ సినిమాకు ఖర్చు దాదాపుగా అంతే అయ్యిందట. ఇక ఈ భామ గుంటూరు కారంలో ఫస్ట్ హీరోయిన్‌గా ఎంపికైంది.. పూజా హెగ్డే అని తెలిసిందే. అయితే ఏవో కారణాల వల్ల ఈ భామ ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆమె స్థానంలో శ్రీలీల చేసింది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి రావడంతో ఈ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. ఆ చర్చ మొత్తం పూజా హెగ్డే చుట్టూ తిరగడం విశేషం.

ముఖ్యంగా పూజా ఫ్యాన్స్, గుంటూరు కారంలో చేయకపోవడమే మంచిదైందని అంటున్నారు. హీరోయిన్స్‌కు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని ఆ సినిమాలో నటిస్తే.. ఉన్న ఆమె సినీ కెరీర్ కూడా క్లోజ్ అయ్యేదని కామెంట్స్ చేస్తున్నారు. అలా ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్లాప్ సినిమాలో పూజాహెగ్డే ఉంటే ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర ఇంకా మరింత బలంగా పడేదని, అప్పుడిక ఆమె పూర్తిగా ఇంటికే పరిమితయ్యేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమాను చూసిన నెటిజన్స్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker