News

డబ్బులిచ్చి మరీ అలా చేయించుకుంటారు, ఆ స్టార్స్ గుట్టురట్టు చేసిన ప్రియమణి.

ఎయిర్‌పోర్టులు, జిమ్‌ల దగ్గర సెలబ్రెటీలు కనబడగానే ఫొటోగ్రాఫర్లు పరిగెత్తుకెళ్లి మరీ ఫొటోలు తీస్తుంటారు. సెలబ్రెటీల స్టిల్స్‌ కోసం ఫొటోగ్రాఫర్స్‌ ఎగబడుతుంటారు. దీన్ని పపరాజీ కల్చర్‌ అని కూడా అంటుంటారు. అప్పుడప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యే ఇలాంటి సీన్స్‌ మనం చూసే ఉంటాం. అయితే ఇంతకీ ప్రియమణి బాలీవుడ్ స్టార్స్ గురించి చెప్పిన విషయాలు ఏంటంటే…

సాధారణంగా హీరోయిన్లు, స్టార్స్ ఎయిర్ పోర్ట్స్ వద్ద, జిమ్ ల వద్ద, పలు షాపింగ్ మాల్స్ వద్ద సందడి చేస్తున్నట్టుగా వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే. పలానా సెలబ్రెటీలు వస్తున్నట్టు అసలు వారికి ముందే ఎలా తెలుస్తుందనే సందేహం అందరికీ ఉంటుంది. తాజాగా ప్రిమయణి వాటిపై స్పందించారు. సోషల్ మీడియా, కెమెరా మెన్లకు డబ్బులిచ్చి మరీ అలా పబ్లిసిటీ చేసుకుంటారంటూ చెప్పుకొచ్చింది.

తను కూడా చేయాలనుకున్నడ్డు అందుకు సంబంధించి ఎంత ఛార్జ్ అవుతుందో ఓ ఏజెన్సీ వ్యక్తి తనకు చార్ట్ పంపినట్టు చెప్పుకొచ్చింది. ఇక సెలబ్రెటీలు పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వడం సాధారణ జనాలకు కాస్తా కన్నుల పండుగలానే ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో మరింతగా వీడియోలను వైరల్ చేస్తూ… ఇంకా క్రేజ్ పెంచుకుంటున్నారు.

ఇది సర్వసాధారమణమే.. కానీ స్టార్స్ కు ఉండే క్రేజ్ తో కాకుండా డబ్బులిస్తేనే అలా వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తారనే విషయం ప్రియమణి ద్వారా తేటతెల్లమైంది. ప్రస్తుతం ‘భామా కలాపం 2’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘ఖైమార’, ‘మైదాన్’ చిత్రాల్లో నటిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker