News

అవి పెద్దగా కనిపించాలని ప్యాడ్స్ వాడాను, సర్జరీకి కూడా సిద్దమయ్యాను : సమీరా రెడ్డి

తెలుగు మూలాలున్న సమీరా రెడ్డి ముంబైలో పుట్టి పెరిగింది. మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హిందీ చిత్రం మైనే దిల్ తుజ్కో దియా తో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం నరసింహుడు. ఎన్టీఆర్-బి గోపాల్ కాంబోలో తెరకెక్కిన నరసింహుడు అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయం చవి చూసింది. అనంతరం చిరంజీవికి జంటగా జై చిరంజీవ చిత్రం చేసింది. ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడో చిత్రం అశోక్.

అయితే బాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్న ఆమెను దర్శకుడు బి గోపాల్ టాలీవుడ్ కి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ తో ఆయన చేసిన నరసింహుడు చిత్రానికి హీరోయిన్ గా ఎంపిక చేశాడు. నరసింహుడు మూవీలో సమీరా రెడ్డి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్ సరసన ఆమెకు మరో ఛాన్స్ వచ్చింది. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ మూవీలో ఎన్టీఆర్-సమీరా రెడ్డి జతకట్టారు. అప్పుడే వీరి మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. సమీరా రెడ్డితో ఎన్టీఆర్ పెళ్ళికి సిద్ధం అయ్యాడంటూ కథనాలు వెలువడ్డాయి.

హరికృష్ణ కట్టడి చేయడంతో వాళ్ళ ఎఫైర్ కి తెరపడిందన్నారు. ఈ పుకార్ల అనంతరం సమీరా రెడ్డి టాలీవుడ్ కి దూరమైంది. మధ్యలో చిరంజీవికి జంటగా జై చిరంజీవ చిత్రం చేసింది. 2014లో బిజినెస్ మ్యాన్ అక్షయ్ వార్డే ను వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. కాగా సమీరా రెడ్డి పలుమార్లు బాడీ షేమింగ్ కి గురయ్యారట. కెరీర్ బిగినింగ్ లో తన శరీరం పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారట. ఒక దశలో ఆమె బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని కొందరు ఆరోపణలు చేశారట. సర్జరీ చేయించుకుని బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలని సలహా ఇచ్చారట.

ఈ కామెంట్స్ ఆమెను ఒత్తిడికి గురి చేశాయట. ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట. బ్రెస్ట్ పెద్దదిగా కనిపించేందుకు ప్యాడ్స్ వాడేదట. సర్జరీకి కూడా ఆమె సిద్ధం అయ్యారట. దానికి సంబంధించిన సమాచారం సేకరించిందట. అయితే సర్జరీ చేయించుకోలేదని సమీరా రెడ్డి వెల్లడించారు. కాగా గర్భం దాల్చిన సమయంలో సమీరా రెడ్డి ఫోటో షూట్ చేయడం విశేషం. చివరి సారిగా తెలుగులో కృష్ణం వందే జగత్ గురుమ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. 2013లో నటనకు గుడ్ బై చెప్పింది…

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker