Health

నీలి రంగు శంకు పువ్వు దేవుడికే కాదు, మన ఆరోగ్యానికి కూడా దివ్యమైన ఔషధం ఎలానంటే..?

ఆయుర్వేద వైద్యులు అనేక వ్యాధుల చికిత్సలో శంఖు పూల మొక్కను వాడతారు. దేవతారాధన కోసం కూడా ఈ తీగజాతి మొక్కను ఉపయోగించడం జరుగుతుంది. ఈ మొక్క యొక్క పూలను టీలో వేసుకుని తాగితే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెర్టిగో, బలహీనత, అజీర్తి, మలబద్ధకం, కామెర్లు, ఎమెసిస్ లాంటి సమస్యలకు శంఖుపూల మొక్కతో సులభంగా చెక్ పెట్టవచ్చు. శంఖు పూలు, ఆకులు, వేళ్లతో చేసిన పొడిని తీసుకోవడం ద్వారా మతిమరుపు రాదు. అయితే ఈ పువ్వులు నీలి రంగు,తెలుపు రంగులో ఉంటాయి. శంఖు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకొనే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు.

అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధన అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖం పుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక శంఖు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను, టీగాను ఎక్కువగా ఉపయోగించటం వలన బాగా పాపులర్ అయింది. శంఖు మొక్క పువ్వులే కాకుండా వేరు, కాండం, ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. శంఖు పూలు, ఆకులు, వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది.

శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనేల్లోలిన్ అనే పదార్ధం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి ముందుగా పనిచేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి.. ఆ వాపు పై పెట్టి కట్టు కడితే.. వాపు తగ్గుతుంది. దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని వేరు విరేచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.

శంఖు పువ్వులో ఉండే ప్రోయంతోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది. శంఖు పువ్వులో ఉండే క్యూయెర్సిటిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి.

నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలచ్చు. లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంఖు మొక్కలో ఏ బీగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు. ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంఖుపువ్వులను వేసి పది నిమిషాల పాటు నాన బెట్టి.. ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker