News

శ్రేయా ఘోషల్ ఒక్క పాటకు ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా ..?

శ్రేయ ఘోషాల్ భారత గాయని. హిందీ చిత్రసీమయైన బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళంలో ఎన్నో పాటలు పాడారు. అయితే నివేదికల ప్రకారం ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయని. అలాగే సినీ పరిశ్రమలో రిచ్ సింగర్. ఆమె ఆస్తులు రూ. 180 నుంచి రూ. 185 కోట్లు ఉంటుంది. శ్రోతలను మంత్రముగ్దులను చేసే స్వరం ఆమె సొంతం.

ఆమె పాటలు చెవుల్లో తేనె పోసినట్లుగా ఉంటాయి. సంతోషం, దుఃఖం, బాధ, ప్రేమ, విరహం ఇలా అన్ని భావాలను జనాల హృదయాలను తాకుతుంది. కానీ శ్రేయా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కపాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం శ్రేయా పారితోషికం విషయం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. సమాచారం ప్రకారం సినిమాలోని ఒక పాట కోసం శ్రేయా దాదాపు రూ. 25 లక్షలు తీసుకుంటుందట.

అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేదు. ఇటీవల అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో శ్రేయా ఘోషల్ సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ తో కలిసి కొన్ని పాటలు ఆలపించింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. చిన్న వయసులోనే సరిగమప రియాల్టీ షో ద్వారా గాయనిగా ప్రయాణం ఆరంభించింది.

16 ఏళ్ల వయసులో ఈ సింగింగ్ షో విజేతగా నిలిచింది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన దేవదాస్ సినిమాలో మొదటి సాంగ్ పాడింది. ఆ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. ఇప్పటివరకు హిందీలో 200కి పైగా పాటలు పాడింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker