Health

షుగర్ ఉన్నవాళ్లు సీతాఫలం తింటే ఏమవుతుందో తెలుసుకోండి.

దేశంలోని అన్ని మార్కెట్లలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ పండు సులువుగా దొరుకుతుంది. మామిడిపండ్లు, యాపిల్స్‌లాగా అందరూ సీతాఫలాలను కూడా ఇష్టంగా తింటారు. ఈ పండు అవసరమైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీతాఫలాన్ని మితంగా తినడం వల్ల అధిక రక్తపోటు నుంచి జీర్ణక్రియ వరకు అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. అయితే ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు డయాబెటీస్ తో బాధ పడుతున్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి కూడా డయాబెటీస్ అనేది పెద్ద సమస్యగా మారింది. 30 ఏళ్లు ఉన్నవారికి కూడా మధుమేహం రావడం దారుణమైన పరిస్థితి. బిజీ లైఫ్ కారణంగా మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఈ షుగర్ వ్యాధి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటీస్ వచ్చిన వారు కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. లేదంటే వారి ప్రాణానికే ప్రమాదం.

అందులో సీతాఫలం కూడా ఒకటి. మధుమేహం ఉన్నవారు సీతా ఫలం తినకూడదని కొందరు అంటూంటారు. సీతాఫలం.. షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చా.. సీతా ఫలాలు తియ్యగా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని చూడగానే తినాలనిపిస్తుంది. సీతాఫలం తింటే ఎంతో ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఇవి సీజనల్ గా దొరికే పండ్లు కాబట్టి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.

విటమిన్ బి6, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉంటాయి. అలాగే సీతా ఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా సీతా ఫలాన్ని తినవచ్చు. ఎలాంటి వారైనా తినొచ్చు.. సీతా ఫలంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీతా ఫలాన్ని ఎలాంటి వారైనా.. ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చు. గుండె జబ్బులు ఉన్న వారు, లావుగా ఉన్నవారు, పాలిసిస్టిక్ ఓవరీ సండ్రోమ్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా నిస్సహందేహంగా తినవచ్చు.

అరుగుదల.. సీతాఫలం తింటే అరుగుదల సమస్యలు ఉండవు. జీవ క్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ వంటి వాటికి చెక్ పెట్టవచ్చు. కంటికి ఆరోగ్యం.. సీతాఫలంలో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో కంటి సమస్యలు దరిచేరవు. అలాగే కంటి శుక్లాల సమస్యలు కూడా ఉండవు. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగు పరుస్తుంది.. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగు పరచడంలో సీతా ఫలం హెల్ప్ చేస్తుంది. దీంతో రక్త హీనత సమస్య కూడా ఉండవు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker