News

యాక్టింగ్ ఆపేసి డాక్టర్ కోర్సు చేస్తున్న హీరోయిన్, మంచి నిర్ణయం అంటూ..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అందులో జీవితా రాజశేఖర్ దంపతుల పెద్ద కూతురు శివానీ. ప్రస్తుతం సినిమాలతో పాటు డాక్టర్ చదువుతోంది. ఈ యేడాది (2024)లో ఈమె డాక్టర్‌గా పట్టాపుచ్చుకోనుంది. అయితే తెలుగుసినిమాల్లో 90 లోని అగ్రహీరోల్లో రాజశేఖర్ ఒకరు. ‘అంకుశం’ సినిమా ద్వారా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఆయన కెరీర్ లో ఎన్నో బెస్ట్ ఫిలింస్ చేశాడు.

కొన్ని సినిమాలు రాజశేఖర్ మాత్రమే చేయగలడు అన్నంతలా నటించాడు. ఆయనతో కలిసి నటించిన జీవిత ఆ తరువాత రాజశేఖర్ కు జీవిత భాగస్వామిగా మారిపోయింది. మొన్నటి వరకు రాజశేఖర్ పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తరువాత ఆయన వారసురాలిగా కూతురు శివాని’ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘దొరసాని’ అనే సినిమాతో శివాని తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేసింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో అమెకు గుర్తింపు రాలేదు.

కానీ ఆ తరువాత ‘అద్భుతం’లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కరోనా సమయంలో ముందుగా ఓటీటీల రిలీజ్ చేశారు. అక్కడ సక్సెస్ అయ్యాక థియేటర్లోకి తీసుకొచ్చారు. దీంతో శివానిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ తరువాత ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో శివాని సినిమాల్లో ట్రై చేయడం మానేసి చదువుపై దృష్టి పెట్టింది. శివాని డాక్టర్ కోర్సు కోసం ప్రాక్టికల్స్ చేయనుందట. దీంతో ప్రస్తుతం సినిమాల్లో నటించనని తెలిపింది.

అయితే చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతారు. కానీ శివాని మాత్రం యాక్టింగ్ వద్దని డాక్టర్ కోర్సుపై దృష్టి పెడుతోంది. వాస్తవానికి తనకు సినిమాల్లో కంటే డాక్టర్ అయి సేవలు చేయడమంటేనే ఇష్టమని చెబుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది మంచి నిర్ణయం అని ఆమెను పొగుడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker