స్మితా సబర్వాల్ కి బిగ్ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఎలానో తెలుసా..?
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/978798798645454-780x470.jpg)
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. బుధవారం ఒక్కరోజే 26 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం సెక్రటరీలను నియమిస్తూ మరో జీవోను ప్రభుత్వం జారీ చేసింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన, ఇరిగేషన్ అదనపు బాధ్యతలను చూస్తున్న స్మితా సబర్వాల్ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేసింది. అయితే తెలంగాణలో పనిచేసే ఐఏఎస్ అధికారుల్లో ప్రముఖంగా వినిపించే పేరు స్మితా సబర్వాల్.
గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమెను.. కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్నును ట్రాన్స్ఫర్ చేసి.. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సందీప్ కుమార్ సల్తానియా TSFC సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడా బాధ్యతలను స్మితా చేపట్టనున్నారు.
2001 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు డైనమిక్ ఆఫీసర్గా పేరుంది. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. స్మితా సబర్వాల్ సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు.
స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను సీఎంవో కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. చాలా రోజుల పాటు ఆ బాధ్యతల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు స్మితా సబర్వాల్. ఐతే ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. సీఎం కార్యదర్శిగా ఉన్న ఆమె..తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా వెళ్లనున్నారు. కాగా, స్మిత సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ఐపీఎస్ అధికారి. కేంద్ర సర్వీసులోని ఇంటెలిజన్స్ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు.