News

జగన్ ఓటమి తర్వాత సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి, ఎత్తండి రా..అంటూ..!!

జగన్ ఓటమి కన్ఫర్మ్ కావడంతో ఆయన వీరాభిమాని శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయింది. వైఎస్ జగన్ పరాజయంపై సంచలన కామెంట్స్ చేసింది. జగన్ అంటే పడిచచ్చే ఆమె వైఎస్సార్‌సీపీ ఓటమిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అయితే నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

మరీ ముఖ్యంగా రాజకీయ విమర్శలు చేయడంలో ఈమెను మించిన తోపు లేరు. ఇక శ్రీరెడ్డి వైసీపీకి మద్దతు తెలుపుతూ ఉంటుంది. వైఎస్ జగన్, వైసీపీకి సపోర్ట్ చేస్తూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ, జగన్‌పై తన అభిమానాన్ని తెలుపుతుంటుంది. అంతే కాకుండా చంద్రబాబు నాయుడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటుంది. అయితే ఆమె ఎన్నికల ముందు వైసీపీ పార్టీనే మరోసారి విజయం సాధించబోతుంది అంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

కానీ ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఘోర పరాజయం అందుకుంది. 175 సీట్లకు గాను కేవలం పది స్థానాల్లో మాత్రమే విజయం సాధించి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓటమిపాలు కావడంతో నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. అరణ్యం పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని చేపట్టినట్లు, పట్టుదల వదలకుండా తన రాజకీయాన్ని జగన్ చాకచక్యంగా కొనసాగిస్తాడు,

ఆయనకు సైన్యంలా మేమంతా తోడుగా ఉంటాం..బాధపడకండి.. ఎత్తండి రా తల, ఎగురయిరా కాలర్, ఏ ప్రభుత్వం ఇవ్వలేని పథకాలను జగన్ ప్రభుత్వం అందించింది. ధైర్యంగా నిలబడరా.. మేము జగన్ అన్న తాలుకా అని చెప్పండి రా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker