News

శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్, అదేంటంటే..?

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ శైలం. పెద్దదోర్నాల శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. కనుక ఈ క్షేత్రానికి వెళ్లే భక్తులకు రాకపోకల విషయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డుని క్లోజ్ చేస్తారు. రహదారిపై వాహనాల రాకపోకలను పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే నిలిపివేస్తారు.

అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా రాత్రి కూడా ఈ రహదారిపై ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు.

బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులను మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం..పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే వాహనాలను ఆపేస్తారు.

అయితే, బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు. వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలని దోర్నాల క్షేత్రాధికారి సూచించారు. ఈ అవకశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker