News

ఈ ఫోటోలోని బ్యూటీ ఇక ఇండస్ట్రీని ఏలబోతోంది, ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం..!

దర్శక నిర్మాతలు కూడా ఫోటోలు చూసి, ఆడిషన్స్ చేసి రోజులకు చెక్ పెట్టి.. ఇన్ స్టా వంటి సోషల్ మీడియా మాధ్యమాలనే ఆశ్రయిస్తున్నారు. వారి డీటైల్స్ చెక్ చేసి.. హీరోయిన్లను సెలక్ట్ చేస్తున్నారు. అందులో ఎంత హాటెస్ట్ పిక్స్ ఉంటే అంత ఫేమస్. అలాగే ఫాలోవర్స్‌ను చూసి కూడా హీరోయిన్లకు ఆఫర్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నారు భామలు. అయితే తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి షిప్ట్ అయ్యింది.

అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ కుర్రకారును నిద్రలేకుండా చేస్తుంది. గ్లామర్ హద్దులు చెరిపేసి నెట్టింట రచ్చ చేస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఎంతో పద్దతిగా పక్కింటి అమ్మాయిల కనిపించిన ఈ తార.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అయ్యింది. రొమాంటిక్ ఎంటర్టైనర్స్, మాస్ యాక్షన్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అందుకే బీటౌన్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. 2013లో మద్రాస్ కెఫె సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

ఇందులో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రమ్ సింగ్ భార్య రూబి సింగ్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మనం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ మూవీ తర్వాత 2014లో విడుదలైన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ హిట్ కావడంతో రాశీకి మంచి క్రేజ్ వచ్చింది. జోరు, జిల్, బెంగాల్ టైగర్, సూప్రీమ్, జై లవకుశ, హైపర్, ఆక్సిజన్, తొలి ప్రేమ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి అలరించింది.

తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన రాశీకి..ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంది. అక్కడ బిజీ నటిగా మారిపోయింది.రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా బీటౌన్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి.. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధా సినిమాలో కనిపించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గానూ మెప్పించింది రాశీ ఖన్నా.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker