Health

మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూర ఇదే. ఎందుకు తినాలంటే..?

తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం.అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అయితే ఒక్కతోట కూరలోనే కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్దాలు ఎక్కువగా లభిస్తాయి.అయితే తోటకూరలో వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. అయితే ఆకుకూరలు తింటే చాలా మంచిదని అటు డాక్టర్లు, ఇటు నిపుణులు వివిధ పరిశోధనల్లో తేలుస్తూనే ఉన్నారు.

కానీ తినడానికి మనకే మనసొప్పదు. కానీ ఏ పండ్లు, కూరగాయలు తిన్నా కూడా లభించని విటిమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. అందుకే గర్భిణులను ఆకుకూరలు ఎక్కువగా తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆకుకూరల్లో తోటకూరలో అత్యధిక విటమిన్లు ఉంటాయని ఇటీవల లండన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేటతెల్లమైంది.

తోటకూరలో క్యాల్షియం, ఎ,బి1, బి2, బి6, సి, కె, విటమిన్లు, ఐరన్, రిబోఫ్లేవిన్, పొటాషియం, జింక్, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. పాలను జీర్ణించుకోలేని వారు తోటకూర తినడం చక్కటి ప్రత్యామ్నాయం. పాల ద్వారా అందాల్సిన క్యాల్షియమ్‌ను తోటకూర భర్తీ చేస్తుంది.

మధుమేహం ఉన్నవారు రోజూ తోటకూర తినడం మంచిది. ఇది ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగినంత ఉండడానికి దోహదం చేస్తుంది. తోటకూర శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వారానికోసారి తోటకూర తింటే నోట్లో పుండ్లు, చిగుళ్లవాపు, గొంతునొప్పి వంటి సమస్యలన్నీ నివారణ అవుతాయి.

ఈ ఆకులోని పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తోటకూర తింటే చక్కటి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker