News

ఆదర్శ దంపతులు, భర్త మరణం తట్టుకోలేక అదే రోజు భార్య మృతి.

అసలైన ప్రేమ వివాహ వ్యవస్థకి “చావులోనూ తోడంటూ” ఓ వృద్ధ జంట ఆదర్శంగా నిలిచింది. భార్యాభర్తల ప్రేమానుబంధం అన్నిటికంటే పవిత్రబంధం. దానికి సాక్షంగా భర్త చావులోనూ తోడంటూ ఆ పవిత్ర ప్రేమబంధానికి ఆదర్శంగా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన ఓ వృద్ధ జంట. అయితే భార్యాభర్తల బంధం శాశ్వతం. వారిరువురు ఒకరికోసం ఒకరు బతకడమే జీవితం.. ఇది నిజం.

అందుకు సజీవ సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ వృద్ద దంపతుల జీవితం.. వీరి భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు సైతం బ్రేక్ చేయలేకపోయింది. ఆత్మీయ దంపతులకు నిదర్శనం ఆ జంట. వృద్దాప్యం లోనూ ఒకరికి ఒకరై జీవనం సాగించారు. మరణం లోను వారి బంధం వీడలేదు. భర్త అనారోగ్యంతో చనిపోతే, అదే రోజు భార్య బెంగతో ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన పినపాక మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

ఆదర్శ దంపతుల హఠాన్మరణం అందరినీ కంటతడి పెట్టించింది. పినపాక మాజీ సర్పంచ్ సుంకరి రాములు గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం క్షిణించిన సుంకరి రాములు మృతి చెందారు. భార్య నర్సమ్మ ఆ బాధని తట్టుకోలేకపోయింది. భర్తతోనే తన గమనం అనుకుందో ఏమో, అదే రోజు సాయంత్రం తాను కూడా తనువు చాలించింది. తల్లి తండ్రి ఒకే రోజు మృతి చెందడంతో వారి పిల్లలు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

రాములు – నర్సమ్మ దంపతులకు ఇద్దరికి కలిపి అంత్యక్రియ నిర్వహించారు కుటుంబ సభ్యులు. దంపతుల అంతిమ యాత్రలో గ్రామస్థులంతా పాల్గొని ఘన నివాళులర్పించారు.ఎనిమిది పదుల వయసులో కూడా వారిద్దరూ ఒకరికి ఒకరై బ్రతికి చివరికి మరణంలో ఒక్కటయ్యారు. తనువులు వేరైనా తాము ఒక్కటే అన్నట్లుగా ప్రపంచానికి తెలియజేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker