News

ఆ అమ్మాయిని గెలకడంతో హైపర్ ఆదిని చితకబాదిన జనం, అసలు ఏం జరిగింది..?

హైపర్ ఆది … బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ టీవీ తెరపైకి దూసుకొచ్చిన ఇతను.. జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథలు కథలుగా చెప్పుకుంటారనేది తెలిసిందే. అయితే హైపర్ ఆదికి కమెడియన్ గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆది, మేడ మీద అబ్బాయి, సవ్యసాచి, మిస్టర్ మజ్ను ఇలా ఇరవైకి పైగా చిత్రాల్లో నటించాడు. తన మార్క్ కామెడీ తో అభిమానులను సొంతం చేసుకున్న హైపర్ ఆది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనపై ప్రచారంలో ఉన్న ఓ రూమర్ పై స్పందించాడు.

జోర్దార్ సుజాత హోస్ట్ గా డయల్ న్యూస్ ఛానల్ లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ షోకి హైపర్ ఆది గెస్ట్ గా వచ్చాడు. ఓ అమ్మాయిని అల్లరి చేసినందుకు నిన్ను ఒంగోలులో కొట్టారట కదా… అని అడిగింది. అదంతగా అబద్దం అని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు. నేను అసలు అమ్మాయిలతో మాట్లాడను. షోలో కూడా స్కిట్స్ లో భాగంగానే అమ్మాయిలతో మాట్లాడతాను.

జోక్స్ వేస్తాను. అది అయిపోయాక వాళ్లతో అసలు మాట్లాడను. నేను అమ్మాయిని గెలకడం, జనాలు నన్ను కొట్టడం అనేది అంతా ఫేక్ అన్నాడు. హైపర్ ఆది ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలో గల చిన్న గ్రామంలో పుట్టాడు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చదువుకున్నాడు. ఆ రోజుల్లో హైపర్ ఆది అమ్మాయి కారణంగా తన్నులు తిన్నారనే ఓ వాదన ఉంది. దానికి హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker