News

స్టేజీపైనే డైరెక్టర్‌కు రాఖీ కట్టిన అనుపమ, రాఖీ కట్టడానికి అసలు కారణం ఇదే.

తాజాగా నిన్న రాత్రి ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు ఆ వైరల్ వీడియోని స్టేజిపై ప్లే చేశారు. అయితే నిన్న జరిగిన ఈ ఈవెంట్ లో అనుపమా పరమేశ్వరన్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. చీరకట్టులో అందంగా మెరిసింది. అందరి చూపుతనపైనే పడేలా చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

నిన్న ఈవెంట్ లో అనుపమా చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. పైగా రవితేజ కూడా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అనుపమా ఏం చేసింది.. రవితేజ ఏమన్నారంటే..! ప్రీ రిలీజ్ వేడుకలో వేదికపైనే ‘ఈగల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కి అనుపమా రాఖీ కట్టింది. తనను అన్నయ్యా అని పిలిచింది. గతంలో నాలుగు సినిమాలు కలిసి పనిచేయడంతో వారి మధ్య మంచి బంధం ఏర్పడిందన్నారు.

దీనిపై మాస్ రాజా స్పందిస్తూ.. ‘అందమైన అమ్మాయిలు అన్నయ్య అని పిలువొద్దు’ అంటూ హెచ్చరించారు. ప్రతి హీరోయిన్ కు మాస్ రాజా ఇదే డైలాగ్ చెబుతూ.. వారిని పొగుడుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ‘ఈగల్’ మూవీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker