Health

ఆస్పిరిన్‌ రెగ్యులర్‌గా వాడుతున్నారా..? మీ ప్రాణాలు తిస్తుందంటున్న శాస్త్రవేత్తలు.

ఆస్పిరిన్‌తో చాలా లాభాలున్నా దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ఇది అల్సర్లు లేదా గుండెల్లో మంట లేదా చాతీ నొప్పిలాంటి వాటికి కార‌ణ‌మ‌వుతుంది. అందువల్ల ఆస్పిరిన్‌ తీసుకునే మోతాదును చెక్ చేసుకోవాలి. అయితే దెబ్బలు తగలినా, ఒళ్లు నొప్పులన్నా, తలనొప్పి ఉన్నా, కాస్త నీరసంగా ఉన్నా ఇంట్లో వాళ్లు ముందు ఆస్పరిన్‌ ట్యాబ్లెట్‌ను వేసుకోమంటారు. కొంతమంది అయితే డైలీ ఒకటి వేసుకుంటారు. సొంత వైద్య అన్నివేళలలా అస్సలు మంచిది కాదు. తాజా స్టడీలో మరో షాకింగ్ విషయం తెలిసింది. పెయిన్ కిల్లర్స్ వల్ల మెదడులో నరాలు చిట్లి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వైద్యులు ఎక్కువగా సూచించే(ఆస్పిరిన్) టాబ్లెట్ చాలా ప్రమాదకరమైనదని తెలిపారు. ఇన్నాళ్లు మనం ఆ మాత్రలను చాలా సురక్షితం అనుకున్నాం. గుండె సమస్యలు, స్ట్రోక్స్ నుంచి రక్షిస్తుందని అనుకున్నాం. అయితే, అదే ఇప్పుడు మీకు ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది. స్ట్రోక్స్ రెండు రకాలు. అందులో ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్, రక్త నాళాలు బ్లాక్ అయినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా ఈ స్ట్రోక్ వస్తోంది. మరొకటి.. హెమరేజిక్ స్ట్రోక్ మెదడులో లేదా మెదడు చూట్టూ ఏదైనా కారణంతో రక్తస్రావం జరిగినప్పుడు ఏర్పడే బ్లడ్ క్లాట్స్ వల్ల స్ట్రోక్‌కు గురవ్వుతారు.

అలాగే వయస్సు పెరిగే కొద్ది ఇలాంటి స్ట్రోక్స్ ముప్పు పెరుగుతుంది. ఈ స్ట్రోక్స్ మరణానికి కూడా దారితీస్తుంది.ఇలాంటి స్ట్రోక్స్ ఏర్పడినప్పుడు వైద్యులు Asprin మాత్రలను తక్కువ మోతాదులో తీసుకోమని చెబుతారు. ఈ మాత్రలు రక్తాన్ని పలుచగా మార్చి స్ట్రోక్స్ నుంచి కాపాడుతాయి. అయితే, తాజా స్టడీ ప్రకారం.. ఈ మాత్రల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, పైగా మెదడులో రక్తస్రావానికి కారణం కావచ్చని తేలింది. స్ట్రోక్స్ సమస్యలేని వృద్ధులకు ఆస్పిరిన్ సూచించినట్లయితే ముప్పు మరింత ఎక్కువ అవుతుందని పరిశోధకులు తెలిపారు.

ఐదేళ్లపాటు 70 ఏళ్లు పైబడిన 19,144 మంది వృద్ధులను పరిశీలించగా.. ఈ విషయం బయటపడిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సగం మందికి ప్రతిరోజూ తక్కువ మోతాదులో ఆస్పిరిన్, మిగిలిన సగం మంది ప్లేసిబో మాత్రలను ఇచ్చారట. ఆస్పిరిన్ తీసుకున్న వారిలో 1.5 శాతం మంది అధ్యయన కాలంలో ఇస్కీమిక్ స్ట్రోక్‌ను ఎదుర్కొన్నారు. ప్లేసిబో తీసుకున్నవారిలో 1.7 శాతం మందికి ఆ స్ట్రోక్స్ వచ్చాయి. ఆస్పిరిన్ తీసుకున్నవారిలో 1.1 శాతం మంది మెదడు, దాని చుట్టుపక్కల రక్తస్రావం జరిగినట్లు తెలుసుకున్నారు.

ప్లెసిబో తీసుకున్నవారిలో అది 0.8 శాతం ఉంది. ఆస్పిరిన్ అతిగా తీసుకోవడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు అతిగా ఆస్పిరిన్ వాడితే సమస్యలు తప్పవు. అతిగా ఆస్పిరిన్ తీసుకోనేవారిలో రక్తహీనత సమస్య కూడా పెరుగుతుందని మరికొన్ని అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి. రక్తంలో ఐరన్ లోపం ఏర్పడినట్లయితే అనీమియా వస్తుంది. అజీర్ణం సమస్యలు కూడా ఏర్పడతాయట. కాబట్టి చీటికి మాటికి పెయిన్‌ కిల్లర్స్‌ వాడకండి.!

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker