News

రజినీకాంత్ ఇంకా చంద్రబాబును కలవకపోవడానికి కారణం ఇదే.

కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజినీకాంత్ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే చెన్నై చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్ గురించి మీడియా ప్రశ్నించింది. దీనిపై రజినీకాంత్ సమాధానం చెప్పారు. చంద్రబాబు, రజినీకాంత్ ల మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.

అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న బాబును పరామర్శించేందుకు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తున్నట్లు జోరుగా ప్రచారాలు నడిచిన సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఇది హాట్ టాపిక్‌ అయింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆదివారం రోజు తమ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరుకు వెళ్లగా.. ఈ విషయమై రజినీకాంత్ ని మీడియా ప్రశ్నించింది.

అయితే నిజానికి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లాలనుకున్నట్లు తెలిపిన రజినీకాంత్.. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని చెప్పారు. రజినీకాంత్ వ్యాఖ్యలతో ఆయన చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రికి రావడం లేదని క్లారిటీ అయితే వచ్చేసింది. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉంటుంటారు. ఇటీవల చంద్రబాబునాయుడు అరెస్టు రిమాండ్ నేపథ్యంలో రజనీకాంత్ ఫోన్ చేసి నారాలోకేష్ ను పరామర్శించారు.

అక్కడ గల పరిస్థితులు రజనీకాంత్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే జనసేన – తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరుణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అదే తరుణంలో చంద్రబాబును పరామర్శించేందుకు తమిల్ సూపర్ స్టార్ వస్తున్నారని ప్రచారం సాగడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు.

అయితే తాజాగా రజినీకాంత్ ఓపెన్ కావడంతో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker