సంతానం లేని వారికి అద్భుత రహస్యం, ఒక్కసారి ఈ ఆలయానికి రండి, తొందరలోనే శుభవార్త వింటారు.
సంతానం లేదని ఎవరూ బాధపడకండి. పిల్లలు లేని దంపతులు సంతానం కోసం కార్పొరేట్ ఆస్పత్రిలో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తుంటారు.. అప్పులపాలవుతుంటారు. అయితే బండపల్లి గ్రామానికి చెందిన వరి భూమయ్యకు స్వప్నంలో వచ్చి గుట్టపై తాను ఉన్నట్లు చెప్పడంతో.. వరి భూమయ్య గుట్టపై వెళ్లి గుహలో చూసేవరకు శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమిచ్చారని,
దీంతో స్వామివారికి దాతలు, గ్రామస్తుల సహాయంతో గ్రామంలో గుట్టపై శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని వైభవోపేతంగా నిర్మించారని ఆలయ అర్చక స్వాములు శ్రీకాంతాచారి తెలిపారు. ప్రతియేట ధనుర్మాస ఉత్సవాలు, స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిరోజు ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు శ్రీలక్ష్మీ సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రతివారం శుక్ర, శనివారాల్లో.. అమ్మవారికి శ్రీ చక్రం ఉన్నతరణంలో అభిషేక పూజ కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని, సంతానం లేని వారికి సంతానం కావాలని కోరుకుంటే స్వామి వారు పిల్లలను కూడా ప్రసాదిస్తాడని, దీంతో ఈ స్వామివారిని సంతాన వెంకటేశ్వర స్వామి వారు అని కూడా పిలుస్తారని అర్చకులు శ్రీకాంతాచారి తెలిపారు.
స్వామి వారి కళ్యాణం,దసరా పర్వదినం నేపథ్యంలో పెద్ద సేవపై గ్రామంలో శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అర్చకులు శ్రీకాంత్ చారి వెల్లడించారు.