బాల రాముడి విగ్రహం దివ్యమైన రూపం చూసేయండి. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/bala789978546-780x470.jpg)
రామాలయంలో ప్రతిష్టించిన బాల రాముడి విగ్రహం 51 ఇంచుల ఎత్తులో ఉంది. అయితే రాముడి విగ్రహం 51 ఇంచుల ఎత్తు ఉండడానికి కూడ ఒక కారణం చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఐదేళ్ల పిల్లలు కనీసం 43 నుండి 45 ఇంచుల ఎత్తు ఉంటారు. అయితే రామాయణ కాలంలో మనుషులు చాలా పొడవుగా ఉండేవారని చెబుతారు. దీంతో బాల రాముడి విగ్రహన్ని 51 ఇంచులుగా రూపొందించారు. ఈ కారణంగానే రామ్ లల్లా విగ్రహం 51 ఇంచుల ఎత్తులో తయారు చేశారు. అయితే బాలరాముడి విగ్రహం తయారీ తర్వాత కార్యశాలలో దించిన ఫోటో బయటకు వచ్చింది.
ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆ ఫోటోపై స్పందించింది. అదే బాలరాముడి దివ్యరూపం అని తెలిపింది. శుక్రవారం ఉదయం కళ్లకు గంతలతో ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నల్లటి (కృష్ణశిల) పద్మపీఠంపై బాలరాముడు దర్శనిమచ్చాడు. ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించిన విషయం తెలిసిందే.
అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు. అక్కడి నుంచి గురువారం ఉదయం జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు.
అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాస్తవానికి గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ట కోసం మూడు విగ్రహాలను ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు సిద్ధం చేయించారు. వాటిల్లో కర్ణాటకకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భ గుడిలో కొలువుదీరనుంది. ఈ విగ్రహాన్ని కోట్లాది మంది భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల్లో ప్రాణ ప్రతిష్ట జరుపుకోనున్న ఈ బాల రామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు.