News

నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు, ఈ సారి ఏం చేసాడో తెలుసా..?

కొంతకాలం బండ్ల గణేష్ ఇంటి రెంట్ చెల్లించడం లేదట. ఈ విషయమై ఆయనను నౌహిరా షేక్ నిలదీయగా బండ్ల గణేష్ రౌడీలతో తనను బెదించాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. అంతేకాదు ఇంట్లోకి కూడా రాబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. తన ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి 15న తనను బెదిరించారని పేర్కొనారు. అయితే కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువై ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

సినీ, రాజకీయ విషయాలపై ఆయన చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతుంటాయి. పలు కాట్రవర్సీలతో జనం నోళ్ళలో నానే బండ్ల గణేష్ పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ఇల్లు కబ్జా చేశారనే ఆరోపణతో బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు. ఫిలిం నగర్ లో హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇల్లును బండ్ల గణేష్ రెంట్‌కి తీసుకున్నారట.

నెలకు రూ. లక్ష అద్దె. అయితే కొంతకాలం బండ్ల గణేష్‌ ఇంటి రెంట్‌ చెల్లించకపోవడంతో ఆ ఇంటిని ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్ళిన నౌహేరా షేక్ ను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డారట బండ్ల గణేష్. తనను రౌడీలతో తనను బెదించాడని నౌహీరా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుండాల సహాయంతో తన ఇంటిని ఆక్రమించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిర్యాదు పేర్కొంది. తన ఇల్లును కబ్జా చేశారని, తన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తొలుత ఆమె ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా పైగా నౌహెరా షేక్ మీదనే ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారట.

దీంతో ఈ వ్యవహారంపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేయడంతో.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బండ్ల గణేష్ పై ఐపిసి 341,506 సెక్షన్ల కింద ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇకపోతే సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ట్రోల్ల్స్ బారిన పడిన సందర్భాలు బోలెడు. తన మాటతీరుతో ఎన్నోసార్లు బుక్కయ్యారాయన. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా నా దారి వేరు అన్నట్లుగా బండ్లన్న ముందుకు వెళుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker