బిగ్బాస్ ప్రైజ్మనీ 35 లక్షలని పల్లవి ప్రశాంత్ ఏం చేసాడో తెలుసా..?
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/02/pallavi978798456-780x470.jpg)
బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరికి టైటిల్ రేస్ కి చేరుకున్నారు. అనూహ్యంగా ఈ కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనే బిగ్ బాస్ విన్నర్ గా గెలిస్తే ఆ డబ్బుతో ఎవరు ఏం చేస్తారనే విషయం గురించి బిగ్ బాస్ అందరిని అడిగారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత బిగ్ బాస్ లో తాను విన్నర్ గా నిలిచిన తరువాత వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకే పంచుతానని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో గెలిసినందుకు పల్లవి ప్రశాంత్ కు 15 లక్షల డైమండ్ నెక్లెస్ 15 లక్షల విలువ చేసే కారు బహుమతిగా ఇచ్చారు. యావర్ 15 తీసుకొని బయటకు రావడంతో పల్లవి ప్రశాంత్ కు ప్రైజ్ మనీ కేవలం 35 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది. అయితే సుమారు రెండు నెలలవుతున్నా పల్లవి ప్రశాంత్ రైతులకు ఒక్క రూపాయి కూడా పంచింది లేదంటున్నారు యాంటీ ఫ్యాన్స్.రైతు బిడ్డ పేరు చెప్పుకుని ప్రశాంత్ మోసం చేశాడని, మాట తప్పాడని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో టీవీ షోలు, పార్టీలతో పల్లవి ప్రశాంత్ బిజీబిజీగా మారిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో అతనిపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో ఇలాగే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ క్యాన్సర్ రోగులకు తన ప్రైజ్ మనీని పంచుతానని మోసం చేశాడని, ఇప్పుడు ప్రశాంత్ కూడా అలాగే మాట తప్పాడంటూ నెటిజన్లు రైతు బిడ్డను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్పై స్పందించాడు బిగ్ బాస్ విన్నర్. ‘ప్రాణం పోయినా ఇచ్చిన మాట మరువను.
నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరం అయినా వెళ్తా.. నిరుపేద రైతు కుటుంబాల కోసం బిగ్ బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తున్నా.. జై జవాన్ జై కిసాన్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు పల్లవి ప్రశాంత్. దీంతో తనపై వస్తోన్న విమర్శలకు, ట్రోలింగ్కు చెక్ పెట్టాడీ రైతు బిడ్డ.