News

ఛార్మీ ఇంట్లో విషాదం, గుండె బద్దలైంది అంటూ ఛార్మీ ఎమోషనల్..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా రాణిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన లైగర్ మూవీ అనుకున్న స్థాయిలో రాణించలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో కాస్త నిరాశ చెందిన వీరు మళ్లీ డబుల్ ఇస్మార్ట్ మూవీతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

టాలీవుడ్ యంగ్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరెకెక్కుతున్న ఈ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు ఛార్మీ. ఛార్మీ ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఆమె తన బంధువును కోల్పోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే తన అంకుల్‏తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ఎంతో స్ట్రాంగ్ గా ఉండే తన అంకుల్ మరణంతో తన గుండె బద్దలైందంటూ భావోద్వేగానికి గురైంది.

“కక్కి అంకుల్ ఎంతో స్ట్రాంగ్‏గా” ఉంటారు. అలాంటి వారు ఇలా ఆకస్మాత్తుగా మరణించారని తెలిసి షాకయ్యాను. నా గుండె బద్ధలైనట్లుగా అనిపిస్తుంది. అసలు జీవితం అనుహ్యమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. పింకీ పిన్నీ, స్వీడేల్, నైసీ, కెన్నీ మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను” అంటూ ఎమోషనల్ అయ్యింది ఛార్మీ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker