News

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ కమెడియన్ అనుమానాస్పద మృతి.

చెన్నైలోని పాలవాక్కమ్‌లో గల ఓ ఫ్లాట్‌లో ప్ర‌దీప్ ఒంట‌రిగా నివ‌సిస్తున్నాడు. అయితే.. అత‌డికి గ‌త రెండు రోజులుగా స్నేహితులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించ‌లేదు. దీంతో అనుమానం వ‌చ్చి వారి స్నేహితుల్లో ఒక‌రు అత‌డు నివ‌సిస్తున్న ప్లాట్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. ఎన్ని సార్లు త‌లుపు కొట్టినా తీయ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. పూర్తీ వివరాలోకి వెళ్తే తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం ఆయన విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతని స్నేహితుడు ఫోన్‌ చేస్తుండగా ఎటువంటి స్పందన రాలేదు.

దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్‌ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. అయితే ప్రదీప్ ఇంటికి లోపలి నుంచి తాళం వేసి ఉంది. విజయన్ గుండెపోటుతో మరణించాడా లేక దాడికి గురయ్యాడా అనేది ఖచ్చితంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంలో ప్రదీప్ కే విజయన్ నటించాడు. ఈ సినిమా శుక్రవారం న రిలీజ్ కానుంది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

దీంతో పలువురు ప్రముఖులు విజయన్ మృతికి నివాళులు అర్పిన్నారు. మరోవైపు జూన్ 12న విజయన్ మరణించినట్లు సమాచారం. ప్రదీప్ కే విజయన్ అనేక తమిళ సినిమాలలో హాస్య నటుడిగా, విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రదీప్ విజయన్‌ను తమిళ సినీ పరిశ్రమ ప్రజలు ‘పప్పు’ అని ముద్దుగా పిలుచుకుంటారు. విజయ్ సేతుపతి నటించిన ‘హే సినీమికా’, ‘తేగిడి’, ‘రుద్రన్’, ‘మహారాజా’ వంటి మరెన్నో సినిమాల్లో ప్రదీప్ విజయన్ కీలక పాత్రలు పోషించాడు.

విజయన్ మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమకు చెందిన పపలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గాయని, నటి సౌందర్య నంద కుమార్ ట్వీట్ చేస్తూ, ‘ఈ వార్త షాకింగ్‌గా ఉంది. విజయన్ నాకు ప్రియమైన సోదరుడిలాంటివాడు. మేం రోజూ మాట్లాడుకోకపోయినా, ఎప్పుడూ ప్రేమతో, ఆత్మీయతతో మాట్లాడుకునేవాళ్లం’ అని ట్వీట్ చేశారు. విజయన్ మరణానికి సంబంధించి ఇంకా పూర్త వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker