Health

కొత్తగా పెళ్లైన దంపతులు రాత్రి పడుకునే ముందు ఏం చెయ్యాలో తెలుసుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విబేధాలు కూడా తొలగిపోతాయి. పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్యబంధంలో మధురానుభూతిని కలిగిస్తుంది.

అయితే కొత్తగా పెళ్లైన దంపతులు కొన్ని విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో కొన్ని అలవాట్లు పాటిస్తే వారి దాంపత్య జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా గడిపేందుకు అధిక సమయం కేటాయించుకోవాలి. దాంపత్య జీవిత రహస్యం పడకగదిలోనే ఉందని అంటారు. ఈ వ్యక్తిగత క్షణాలను అనుభవించాలి.

ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా నిద్రపోయే ముందు బెడ్రూం మూమెంట్స్‌ మెమరబుల్‌గా ఉండేలా చూసుకోవాలి. అందుకే రాత్రి పడుకునే ముందు దంపతులు కొన్ని చిట్కాలు పాటించాలి. భార్యాభర్తలు రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి. పడుకునే ముందు మొబైల్ దూరంగా ఉంచాలి.

లేదంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మొబైల్ ఫోన్ తగ్గించే ప్రమాదం ఉంది. పడుకునే ముందు కలిసి శృంగారభరితంగా మాట్లాడుకోవాలి. నిద్రపోతున్నప్పుడు ఫైనాన్స్, ఆఫీసులో పని గురించి మాట్లాడకండి. దీని వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మంచి నిద్ర కోసం భార్యభర్తలిద్దరూ తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి.

రాత్రి పూట మితమైన భోజనం ఆరోగ్యంతో పాటు మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. రాత్రి పడకగదిలో కూర్చుని ఆఫీసు పనులు చేయకండి. పడుకున్నప్పుడు మీ భాగస్వామిని ఎగతాళి చేయకండి. నిద్రపోయే ముందు మీ భాగస్వామితో మాట్లాడండి. దీంతో ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker