ఆవు మూత్రం కంటే గేదె మూత్రమే ఆరోగ్యానికి చాలా మంచిది, పరిశోదనలో ఐవిఆర్ఐ శాస్త్రవేత్తలు.

ఆరోగ్యవంతమైన ఆవులు, ఎడ్ల నుంచి సేకరించిన మూత్ర నమూనాలలో 14 రకాల హానికర బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అందులో కడుపులో ఇన్ఫెక్షన్లు దారితీసే ఇషిరిచియా కోలి అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ పరిశోధనా పత్రాన్ని ఆన్లైన్ రిసెర్చ్ వెబ్సైట్ రిసెర్చ్గేట్లో ప్రచురించారు. ఆవులు, గేదెలు, మనుషుల మూత్రాలకు చెందిన 73 శాంపిల్స్ను అధ్యయనం చేశామని, ఆవుల కన్నా గేదెల మూత్రం యాంటీ బ్యాక్టీరియల్ శక్తిని కలిగి ఉందని ప్రొఫెసర్ సింగ్ పేర్కొన్నారు. అయితే గోమూత్రాన్ని అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే చాలా పరిశోధనలు కూడా వెల్లడైంది. పురాతన కాలంలోని ఆయుర్వేదంలో.. వివిధ ఔషధాల తయారీలోనూ గోమూత్రంను ఉపయోగించారు.
ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. పల్లెటూళ్లలో ఇంటి ముందు గోమూత్రం చల్లుకుంటారు. లక్షలాది మంది ఎంతో నమ్మకంతో సేవిస్తున్న గోమూత్రంలో హాని కలిగించే బ్యాక్టీరియా ఉందంటూ ఓ సంచలన పరిశోధన వెలుగులోకి వచ్చింది. బరేలీకి చెందిన ఐసీఏఆర్-ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) పరిశోధన ప్రకారం.. ఆవు మూత్రంలో మానవులకు హాని కలిగించే అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడైంది. ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు ఆవు మూత్రంపై పరిశోధన చేసి నివేదికను వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆవుల మూత్రం నమూనాలలో 14 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. కడుపు ఇన్ఫెక్షన్కు కారణమయ్యే ఈ-కోలి వంటి బ్యాక్టీరియా ఉందని తెలిపారు.
ఈ నివేదికను సమీక్షించిన పరిశోధన వెబ్సైట్ రీసెర్చ్ గేట్లో పబ్లిష్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఐవీఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఎపిడెమియాలజీ విభాగం అధిపతి భోజరాజ్ సింగ్ మాట్లాడుతూ.. తాము ఆవు, గేదె, మానవుల మొత్తం 73 రకాల మూత్ర నమూనాలను పరిశీలించామని తెలిపారు. ఈ పరిశోధనలో ఆవు మూత్రం కంటే గేదె మూత్రంలో ఎక్కువ యాంటీ బాక్టీరియా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎస్ ఎపిడెర్మిడిస్, ఇ రెపోంటిచి అనే బాక్టీరియాపై గేదే మూత్రం పవర్ఫుల్గా పనిచేస్తుందని వెల్లడించారు.
‘మేం పరిశోధనకు స్థానిక డెయిరీ ఫామ్ నుంచి సాహివాల్, థార్పార్కర్, విందావని (క్రాస్ బ్రీడ్) ఈ మూడు రకాల ఆవుల మూత్ర నమూనాలను తీసుకున్నాం. దీంతో పాటు గేదెలు, మనుషుల మూత్ర నమూనాలను కూడా సేకరించాం. ఈ పరిశోధన గతేడాది జూన్లో పూర్తి చేశాం. ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలు, జంతువుల పరిమిత మూత్ర నమూనాలు పెద్ద మొత్తంలో వ్యాధికారక బ్యాక్టీరియాను కలిగి ఉన్నాయని మా పరిశోధనలో వెల్లడైంది..’ అని భోజరాజ్ సింగ్ తెలిపారు. కొన్ని జంతువుల మూత్రం వివిధ రకాల బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని వెల్లడించారు. అయతే ఎట్టిపరిస్థితుల్లోనూ మనుషులు మూత్రం తాగవద్దని హెచ్చరించారు.
స్వేదన మూత్రంలో ఇన్ఫెక్షన్ బాక్టీరియా ఉండదని కొందరు వాదించారని.. ఇందుకు సంబంధించి కూడా పరిశోధించామన్నారు. ఐవీఆర్ఐ మాజీ డైరెక్టర్ ఆర్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా గోమూత్రంపై తాను పరిశోధన చేస్తున్నానని.. స్వేదనం చేసిన ఆవు మూత్రం తీసుకుంటే మానవుల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందన్నారు. ఇది క్యాన్సర్, కోవిడ్లో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు గోమూత్రాన్ని తీసుకోవాలనుకుంటే.. శుద్ధి చేసిన గోమూత్రాన్ని వినియోగించాలని సూచించారు.