Health

మీకు కళ్లు మసక మసకగా కనిపిస్తున్నాయా..? ఈ వ్యాధి మీకు ఉండొచ్చు, జాగర్త.

పొడి కన్ను చాలా మందిని దీర్ఘకాలికంగా వేధించే సమస్య. కళ్ళల్లో తగినంత నీరు లేకపోవడం కారణంగా కన్నీళ్లు ఉత్పత్తి అవ్వదు. పొడి కళ్ళల్లో ఉండే ముఖ్య లక్షణాలలో చికాకు, మంట, ఉండటం, ఎక్కువ సమయం పాటు స్క్రీన్‌ని చూడటం కష్టంగా ఉంటుంది. అయితే డయాబెటిస్‌ సమస్య ఉన్నవారిలో కంటి చూపు మందగించే అవకాశాలు ఉంటాయి. కొన్నికొన్నిసార్లు వివిధ వస్తువుల రూపాలను కనిపెట్టడం కూడా చేయలేకపోతారు. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని చక్కెర వ్యాధితో బాధపడుతున్న మహిళలు.. వారి కండ్లపై కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం.

డయాబెటిస్‌1, టైప్‌-2 కలిగిఉన్న దాదాపు 25 శాతం మందిలో రక్తంలో అధిక చక్కెరల స్థాయితో పాటు కంటి సమస్యలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించలేకపోవడంతో అది కంటి వెనుక ఉండే సన్నటి రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. తద్వారా కంటి చూపు పూర్తిగా పోయే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్‌ ఐ ఎవరిలో ఎక్కువ.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల అది కండ్లను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కాలం మధుమేహం ఉన్న వ్యక్తులు, డయాబెటిస్‌ లక్షణాలు ఉన్న గర్భిణీలు, దీర్ఘకాలంపాటు రక్తంలో గ్లూకోజ్‌ను అదుపుచేయని వారు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కలిగి ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారిలో డయాబెటిక్‌ ఐ కనిపిస్తుంది.

అలాగే, సిగరెట్‌ స్మోకింగ్‌ చేసేవారిలో, ఊబకాయులు కూడా డయాబెటిక్‌ ఐ కి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇది మన జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. మధుమేహులు తప్పనిసరిగా రక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రించేలా చూసుకోవడం అవసరం. డయాబెటిక్‌ ఐ ఉన్నవారిలో లక్షణాలు: డయాబెటిక్‌ ఉన్నవారిలో సాధారణంగా.. చూపు మసక బారటం, రంగులను గుర్తించడంలో ఇబ్బందిగా మారడం, చూపుపై చుక్కలు, తీగలు వేలాడుతున్న అనుభూతి కలగడం, తక్కువ వెలుతురులో చూడటం ఇబ్బందికరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలాంటి సమస్యలు కనిపించగానే వెంటనే కంటి వైద్యుడ్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం. లేనట్లయితే, కంటి సమస్యలు మరింత ఎక్కువై కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంటి వైద్యుడిని కలిసి ఏడాదికోసారి కంటి పూర్తి చెకప్‌ చేయించుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి.డయాబెటిక్‌ ఐ ని తొలి దశలోనే గుర్తించడం ద్వారా తగిన మందుల వాడకంతో అదుపులో పెట్టుకోవచ్చు. కంటి వైద్యుడిని సంప్రదిస్తూనే కొన్ని లైఫ్‌స్టైల్‌ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి.

తరచుగా బ్లడ్‌ గ్లూకోజ్‌ పరీక్షలు చేయించుకుంటూ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. తంబాకు తినడం, సిగరెడ్‌, బీడీ తాగడం మానుకోవాలి. ప్రతియేటా ఒక్కసారైనా పూర్తి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం తప్పనిసరి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవడం ద్వారా మధుమేహం ఉన్నవారు కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker