News

చికెన్ తిని మందేస్తూ యువకుడు మృతి, రిపోర్ట్ చూసి షాకైనా డాక్టర్లు.

ఓ వ్యక్తి మందు తాగుతూ, చికెన్ తింటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే.. అతడి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అయితే వైద్యులు చెప్పిన కారణంతో కుటుంబ సభ్యుల షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే… ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారి గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఏలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్నారు.

మంగళవారం రాత్రి ఇద్దరు పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం.. చికెన్ తెచ్చి మాంచి స్పైసీగా వండుకున్నారు. తమకు ఇష్టమైన పూరీలు చేసుకున్నారు. ముక్క ఉంటే మందు కూడా ఉండాలి అనుకున్నారు ఏమో.. మద్యం కూడా అప్పటికే తెచ్చిపెట్టుకున్నారు. కుకింగ్ పూర్తయిన తర్వాత.. చికెన్‌ను స్టఫ్‌గా తింటూ మద్యం తాగుతున్నారు. ఇంతలోనే విషాదం జరిగింది జితేంద్ర అనే వ్యక్తి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు.

ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫరూక్ నగర్ మండలం‌లో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఝార్ఖండ్ కు చెందిన జితేంద్ర, ధర్మేంద్ర ఎలికట్ట గ్రామంలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి సమయంలో చికెన్ వండుకుని తింటున్న సమయంలో జితేంద్ర అస్వస్థతకు గురై పడిపోయాడు.

దీంతో ఇరుగు పొరుగువారు జితేంద్రను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే జితేంద్ర అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు తెలిపారు. అనంతరం అతని మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొవడం వల్లే జితేంద్ర చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker