Health

షుగ‌ర్ ఉన్నవారు ఈ రొట్టెలు తింటే చాలు, షుగ‌ర్ 500 ఉన్నా స‌రే దిగొస్తుంది.

వయసు, అదుపులేని జీవనశైలి కారణంగా, మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మధుమేహం ఆకస్మికంగా వచ్చే డిసిస్ కాదు. క్రమంగా ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో ఉంటుంది . దీని కోసం ఖరీదైన మందులు తీసుకోవలసిన అవసరం లేదు. అయితే షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ముచ్చ‌టగా మూడు సూత్రాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఈ వ్యాధి అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ముందుగా తెల్ల‌టి బియ్యంతో వండిన అన్నాన్ని తిన‌డం మానేయాలి. బియ్యాన్ని పాలిష్ ప‌ట్ట‌డం వ‌ల్ల పై రెండు పొర‌ల్లో ఉండే పోష‌కాల‌న్నీ త‌వుడులోకి వెళ్లిపోతున్నాయి. మిగిలిన తెల్ల‌బియ్యంలో కేవ‌లం కార్బోహైడ్రేట్స్ మాత్ర‌మే ఉంటాయి. అత్య‌ధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ధాన్యాల్లో బియ్యం ఒక‌టి. బియ్యంలో 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అన్నాన్ని ఎంత ఎక్కువ‌గా తింటే షుగ‌ర్ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు అంత ఎక్కువ‌గా ఉంటాయి.

అలాగే అన్నాన్ని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి పెరుగుతుంది. క‌నుక షుగ‌ర్ వ్యాధి అదుపులోకి రావాల‌నుకునే వారు అన్నాన్ని తిన‌డం మానేయాలి. పుల్కాల‌ను, జొన్న రొట్టెల‌ను మాత్ర‌మే తినాలి. మ‌ధ్యాహ్నం పుల్కాల‌ను, రాత్రి జొన్న రొట్టెల‌ను ఎక్కువ కూర‌ల‌తో ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం తీసుకునే కార్బోహైడ్రేట్ ల శాతం త‌గ్గుతుంది. అలాగే కూర‌ల్లో ఉప్పు లేకుండా తీసుకోవాలి. ఉప్పు త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే రెండ‌వ‌ది… షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఉద‌యం పూట ఇడ్లీ, దోశ‌, ఉప్మా వంటి అల్పాహారాల‌ను తీసుకోకూడ‌దు. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. రోజూ ఉద‌యం 3 ర‌కాల గింజ‌ల‌ను మొల‌కెత్తించి తీసుకోవాలి. అలాగే వీటితో పాటు పండ్ల‌ను తీసుకోవాలి. ఇక చివ‌రిది రోజూ ఉద‌యం చెమ‌ట ప‌ట్టేలా వ్యాయామం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. అలాగే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత ఒక గంట పాటు వాకింగ్ చేయాలి.

ఇలా మూడు నియ‌మాల‌ను పాటిస్తూ రోజుకు మూడు సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది. త‌ర‌చూ ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుంటూ వైద్యున్ని సంప్ర‌దించి మందుల మోతాదును త‌గ్గించుకుంటూ ఉండాలి. ఈ విధంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker