News

చివరి చూపు దక్కలేదు అంటూ.. జబర్దస్త్ స్కిట్ చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్.

జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న కమెడియన్లంతా సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా రాణిస్తున్నాడు. హైపర్ ఆది పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. గెటప్ శ్రీను కూడా రాజు యాదవ్ అంటూ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళకి కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో దాదాపు ప్రతి ఇంటికి ఇమ్మానుయేల్ అంటే ఎవరో పరిచయం అయిపోయాడు.

ఇక ఇప్పుడు ఇమ్మానుయేల్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు కానీ మొట్టమొదటిసారి ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న గం గం గణేశా సినిమాలో పూర్తిస్థాయి హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్న ఇమ్మానుయేల్ తన జీవితంలో ఎదురైన ఒక విషాదకర సంఘటన గురించి షేర్ చేసుకున్నాడు.

అదేంటంటే జబర్దస్త్ లోకి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తుందని, అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తండ్రి ఫోన్ చేసి తాత చనిపోయిన విషయం చెప్పాడని పేర్కొన్నాడు. నిజానికి తన తాత అంటే చాలా ఇష్టం కానీ అప్పుడు వెళ్తే జబర్దస్త్ ప్రోగ్రాం డిస్టర్బ్ అవుతుందని భావించి వెళ్లలేక పక్కకు వెళ్లి కాసేపు వెక్కివెక్కి ఏడ్చానని తర్వాత కళ్ళు తుడుచుకుని వచ్చి స్కిట్ పెర్ఫార్మ్ చేస్తే ఆ స్కిట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికీ తాను చేసిన బెస్ట్ స్కిట్స్ లో అది కూడా ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఇక అయితే ఆ స్కిట్ చేయడం పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు పూర్తయ్యాయని తాత చివరి చూపు కూడా చూసుకోలేకపోయానని ఇమ్మానుయేల్ ఎమోషనల్ అయ్యాడు. అలాంటివన్నీ దాటుకుని వచ్చాను కాబట్టి ఈరోజు ఎంతో కొంత నిలబడగలుగుతున్నానని కామెంట్ చేశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker