News

12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పి భర్తతో విడిపోయిన హీరోయిన్, ఆ వివాహేతర సంబంధమే కారణం..!

ధర్మేంద్ర, హేమమాలినిల పెద్ద కుమార్తె ఈషా డియోల్ తన భర్త భరత్ తఖ్తానీ నుండి విడిపోతున్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య సంబంధాలు చెడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇషా తన రెండవ కుమార్తెకు తల్లి అయినప్పుడు, తన భర్తతో తన సంబంధం క్షీణించిందని ఇషా పేర్కొంది. భరత్‌కి వేరే అమ్మాయితో ఉన్న సంబంధమే ఈ బంధం విడిపోవడానికి కారణమని అంటున్నారు.

బెంగళూరులో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి భరత్ న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడం కూడా ఇషా చూసిందని సమాచారం. అయితే బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర, హేమమాలీన కూతురు ఈషా డియోల్. 21 ఏళ్ల వయసులోనే కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈషా. 2002లో కోయి మేరే దిల్ సే పూచే సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2008 వరకు దాదాపు ఆరేళ్లలో 30కి పైగా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత భరత్ తక్తానీతో పెళ్లి తర్వాత సినిమాకు దూరంగా ఉండిపోయింది. గత కొన్నాళ్లుగా ఈషా డియోల్, ఆమె భర్త భరత్ విడిపోయారని వార్తలు వచ్చాయి. పలు ఈవెంట్స్, కార్యక్రమాల్లో తన భర్త లేకుండానే ఈషా ఒంటరిగా హజరుకావడంతో డివోర్స్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలలో కేవలం ఈషా తాను ఒంటరిగా ఫోటోస్ షేర్ చేస్తుండడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు వీరి డివోర్స్ నిజమే అని తెలుస్తోంది. ఇషా, భరత్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2017 కూతురు రాధ, 2019లో పాప మీరయా జన్మించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker