News

ఆర్పీకి కోలుకోలేని దెబ్బ..! గుట్కా నాయాళ్లు కత్తులు పట్టుకొని వెంటాడారు :కిరాక్ ఆర్పీ

ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఫలితాల అనంతరం వైఎస్ జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంతా మంచే చేశానని, కానీ ఎందుకు తనను ఓడించారో అర్ధం కావడం లేదన్నారు. అయితే కొన్నాళ్ళు ఖాళీగా ఉన్న కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ కూకట్ పల్లిలో ఏర్పాటు చేశాడు. ఇది ట్రెమండస్ సక్సెస్ కావడంతో కిరాక్ ఆర్పీకి విపరీతంగా లాభాలు వచ్చాయి.

మణికొండలో మరొక బ్రాండ్ ఏర్పాటు చేశాడు. ఇటీవల తిరుపతిలో కూడా ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ ద్వారా కిరాక్ ఆర్పీ భారీగా సంపాదిస్తున్నాడని సమాచారం. కిరాక్ ఆర్పీ చేపల పులుసు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర ఎక్కువ తీసుకుంటున్నారని. రుచి అంతగా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కిరాక్ ఆర్పీ ఛార్జ్ చేసే ధరకు, చేపల పులుసు క్వాలిటీ, రుచికి పొంతన లేదంటున్నారు. గతంలో ఇలాంటి విమర్శల మీద కిరాక్ ఆర్పీ స్పందించాడు. నా రేటు అది. ఇష్టం అయితే తినండి లేదండి లేదు. జేబులో వంద రూపాయలు వేసుకొచ్చి చేపల పులుసు కావాలంటే దొరకదు అన్నాడు. కిరాక్ ఆర్పీ చేపల పులుసులో పెద్దగా నాణ్యత లేదనేది తాజా సమాచారం. అయితే ఇదిలావుండగా.. ఏపీలో కూటమి అధికారం రావడంపై హర్షం వ్యక్తం చేశారు జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ.

అంతేకాదు.. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా వ్యవహరించిన విషయాలను ఆయన బయటపెట్టారు. అర్ధరాత్రుళ్లు తన ఇంటి డోర్లు కొట్టేవారని, తన వెనుక కత్తులతో ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయని కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారానికి కూడా ఇబ్బందులు కలిగించేలా.. తనకు వచ్చిన ఫ్రాంచైజీలను అడ్డుకున్నారని , రేపు అడ్వాన్స్ తీసుకుందామని అనుకుంటే ఇవాళే వారిని ఆపేసేవారని కిరాక్ ఆర్పీ ఆరోపించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker