News

సాయి పల్లవి వెనకున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్.

పడి పడి లేచే మనసు 2018 లో విడుదలైన తెలుగు సినిమా. హను రాఘవపూడి దర్శకత్వంలో కథానాయకుడిగా శర్వానంద్, కథా నాయకిగా సాయిపల్లవి నటించారు. ఈ సినిమా 2018 డిసెంబరు 21న విడుదలైనది. అయితే ఈ సినిమాలో శర్వానంద్, సాయి పల్లవి తమ నటనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి మనకు ఇలాంటి లవర్ ఉండాలి అనేలా తన క్యూట్ పర్ఫామెన్స్‌తో మెప్పించింది. ఈ సినిమా 2018 డిసెంబరు 21న విడుదలైంది. ఈ సినిమాను కోల్‌కతాలో షూట్ చేశారు.

విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా నటించిందని తెలుస్తోంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? ఆమె చాలా ఫెమస్ గురూ. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఎవరో కనిపెట్టండి.? చాలా మంది ఆమెను కనిపెట్టలేకపోయారు. ఆమె మరెవరో కాదు రీసెంట్ సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఫేమ్ మమిత బైజు.

పడి పడి లేచే మనసు సినిమాలోనూ ఓ సాంగ్ లో సాయి పల్లవి వెనక కనిపించిన యువతీ అచ్చం మమితలానే ఉంది. దాంతో ఆమె ఈ సినిమాలో నటించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పడి పడి లేచే మనసు సినిమాలో మమిత జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిందని అంటున్నారు నెటిజన్స్. హీరోయిన్ అవ్వక ముందు మమిత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది. అయితే ఈ సినిమాలో మమిత నటించిందా లేదా అన్నదానిపై క్లారిటీ అయితే లేదు. కానీ నెటిజన్స్ ఈ అమ్మడి ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కొందరు ఆమె మామిత కాదు అని అంటున్నారు మరికొంతమంది ఆమె అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మమిత ప్రేమలు సినిమాతో పాపులర్ అయ్యింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. త్వరలోనే ఆమె తెలుగులో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker