News

సినీ పరిశ్రమలో విషాదం, గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత.

గతంలో రాజశేఖర తో సినిమా చేసిన ఓ దర్శకుడు ఈరోజు మరణించినట్టు తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు సూర్య ప్రకాష్ ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తమిళ సీనియర్ హీరో, రాజకీయవేత్త అయినటువంటి శరత్ కుమార్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సూర్య ప్రకాష్ మరణ వార్త తనని ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ చేసిందని తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

అయితే ప్రముఖ దర్శకుడు సూర్య ప్రకాష్.. గుండె పోటులో సోమవారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని కోలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ వేత్త శరత్ కుమార్ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని దర్శకుడు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు. మాణిక్కం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సూర్య ప్రకాష్.. ఆ తర్వాత శరత్ కుమార్ హీరోగా మాయి చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇక తెలుగులో కూడా ఆయన ఒక్క సినిమానే చేశాడు. రాజశేఖర్, మీనా హీరో హీరోయిన్లుగా వచ్చిన భరత సింహా రెడ్డి మూవీకి దర్శకుడు ఆయనే.2002లో విడుదలైంది ఈ చిత్రం. ఓకే అనిపించుకుంది. ఇందులో గజాల, రవళి కీలక పాత్రలు పోషించారు. మళ్లీ శరత్ కుమార్‪తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కిరణ్ రాథోడ్, శరత్ కుమార్ హీరో హీరోయిన్లుగా దివాన్ అనే చిత్రాన్ని రూపొందించాడు.

2015లో అధిబర్ అనే చిత్రానికి మెగా ఫోన్ పట్టాడు సూర్య ప్రకాష్. అంతకు ముందు వరుసనాడు అనే విలేజ్ రొమాన్స్ చిత్రం చేశాడు. తన కజిన్ నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇంకా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. అంతకు ముందు కూడా ప్రభు కోసం ఓ సినిమాకు పని చేశాడు. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker