News

జాన్వీ కపూర్ పదే పదే తిరుపతికి రావడానికి కారణం ఏంటో తెలుసా..?

చెన్నైలోని ముప్పతమ్మన్ ఆలయం అంటే జాన్వీకపూర్ తల్లి, దివంగత నటి శ్రీదేవికి ఎంతో ఇష్టం.అందుకే ఆ గుడికి వెళ్లింది జాన్వీకపూర్. ఈస్టార్ కిడ్ తో పాటు శ్రీదేవి చెల్లెలు,జాన్వీ పిన్ని మహేశ్వరి కూడా ఉంది. జాన్వీ పూల ప్రింట్లు ఉన్న లెహంగా ధరించి కనిపించింది. ఆమె బీచ్ వేవ్ హెయిర్‌తో దాన్ని పూర్తి చేస్తూ సింపుల్ లుక్‌ని ఎంచుకుంది. అయితే బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ తరచు తిరుమల వెళ్లే విషయం మనందరికి తెలిసిందే. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు.

లంగావోణిలో తాను సినిమాల్లో ఉండేదానికి భిన్నంగా జాన్వీ కనిపిస్తుంటుంది. ఇక ఈ అమ్మడు తరచూ తిరుమలకు వెళ్తుండటంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. సినిమాల్లో అంతలా రెచ్చిపోయే జాన్వీలో ఆధ్యాత్మిక చింతన కనిపించడం చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అయితే తాను తరచూ తిరుమలకు వెళ్లడానికి గల కారణాలను జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. తన తల్లి కొన్ని విషయాలను బాగా విశ్వసించేదని, ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయడానికి అంగీకరించేది కాదని తెలిపింది.

అలాగే శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని, అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని తన తల్లి చెప్పేదని ఈ బ్యూటీ తెలిపింది. శుక్రవారం నల్ల దుస్తులను అసలు వేసుకోనిచ్చేది కాదని, ఆమె బతికి ఉన్నప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకోలేదని వెల్లడించింది. కానీ తన తల్లి దూరమయ్యాక వీటిని నమ్మడం మొదలుపెట్టానని తెలిపింది. ప్రస్తుతం శ్రీదేవి కంటే జాన్వీనే ఎక్కువగా ఆ నమ్మకాలను విశ్వసిస్తున్నారట. అమ్మ బతికున్నప్పుడు ప్రతి ఏడాది పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేదని తెలిపింది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి తాను ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను తెలిపింది.

అమ్మ లేకుండా తొలిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని జాన్వీ తెలిపింది. తిరుమలకు వెళ్తే..ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుందని, అందుకే తరచు వెళ్తుంటానని తెలిపింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ సినిమాలో నటించింది. ఈ సినిమా మే 31న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో జాన్వీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ మూవీని సంయుక్తంగా నిర్మించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker