News

పెళ్ళైన 6 నెలలకే భర్తకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరోయిన్, ఆ సీక్రెట్స్ తెలియడంతోనే..!

మనీషా కోయిరాలు నేపాల్ లో 1970 ఆగస్టు 16న జన్మించారు. ఈమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే 1989లో ‘ఫేరి భేతైలా’ అనే నేపాలి సినిమాలో నటించింది. అయితే మనీషాకు చిన్నప్పుడు డాక్టర్ కావాలన్న కోరిక ఉండేది. కానీ 1991 ‘సైదాగర్’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 1942లో ‘ఎ లవ్ స్టోరీ’, 1994లో తమిళ చిత్రం ‘బాంబే’ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సాధించింది. ఆ తరువాత తెలుగులో క్రిమినల్ అనే సినిమాలో నాగార్జునతో కలిసి నటించింది.

అయితే ఆమె చాలా మందితో ప్రేమాయ‌ణం సాగించింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. కానీ వాటిలో ఏది పెళ్లి వ‌ర‌కూ దారి తీయ‌లేద‌ని ర‌క‌ర‌ర‌కాల విమర్శ‌లు ఎదుర్కుంది. అటుపై కొన్నాళ్ల‌కు మనీషా 2010న నేపాల్ పారిశ్రామికవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి సంబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఆ బంధం రెండు నెల‌ల్లోనే వీగిపోయింది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు త‌లెత్త‌డంతో విడాకుల‌తో వేరయ్యారు. దీని గురించి మ‌నీషా కోయిరాలా ఎక్క‌డా పెద్ద‌గా మాట్లాడింది కూడా లేదు.

తాజాగా విడాకుల గురించి స్పందించింది. నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడు లేదు అంటూ విఫలమైన వివాహం గురించి తెలిపింది. `పెళ్లయిన ఆరు నెలల తర్వాత నా భర్త నాకు శత్రువు అయ్యా డు. స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది అని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా పటేకర్‌తో కూడా మనీషాకు ఎఫైర్ ఉంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి.

అయితే నానా ప‌టేక‌ర్ కి అప్ప‌టికే వివాహ‌మైంది. ఇంకా వివేక్ ముశ్రన్.. డీజే హుస్సేన్.. సిసిల్ ఆంథోనీ.. ఆర్యన్ వేద్.. ప్రశాంత్ చౌదరి.. క్రిస్పిన్ కాన్రాయ్.. తారిక్ ప్రేమ్‌జీ.. రాజీవ్ మూల్‌చందానీ.. క్రిస్టోఫర్ డోరిస్‌లతో మనీషాకొయిరాలా ప్రేమాయణం నడిపిందని గుసగుసలు వినిపించాయి. మ‌నీషా సోష‌ల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అమ్మడికి ఇక్క‌డ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker