News

వామ్మో, 50 సెకండ్ల యాడ్ కు రూ.5 కోట్లు తీసుకున్న తెలుగు హీరోయిన్.

ఓ యాడ్ లో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే భారతదేశంలో కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో కంటే యాడ్స్‌ ద్వారానే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు. అలియా, దీపిక, కత్రినా, కరీనా సమంత వంటి హీరోయిన్లు నిమిషం కంటే తక్కువ నిడివిగల యాడ్స్‌లో నటించినందుకే రూ.కోట్లు అందుకుంటున్నారు.

అయితే వీరందరి కంటే ఎక్కువ సంపాదించే హీరోయిన్ మరొకరు ఉన్నారు. ఆమె సౌత్ ఇండియాకి చెందిన నటి. ఆమె మరెవరో కాదు లక్ష్మీ, తులసి, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నయనతార. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నయనతార అవతరించింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల 50 సెకన్ల యాడ్‌ కోసం ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసి, కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

ఈ ఫీజు ఆమె బీభత్సమైన పాపులారిటీకి నిదర్శనంగా నిలుస్తోంది. నయనతార ఎండార్స్‌మెంట్‌ లేదా సపోర్ట్ కోసం బ్రాండ్స్ ఎంతగా పాకులాడుతున్నాయో కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పార్ట్‌ టైమ్‌ మోడల్‌గా మొదలైన కెరీర్‌ స్టార్‌డమ్‌ సంపాదించడానికి ముందు, నయనతార పార్ట్ టైమ్ మోడల్‌గా, టీవీ హోస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.

అలాంటి చిన్న స్థాయి నుంచి లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. గత 20 ఏళ్లుగా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌ని కూడా షేక్‌ చేస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker